డేట్ ఖాయం చేసుకున్న పవన్-త్రివిక్రమ్

Update: 2017-03-24 04:47 GMT
పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం ఇవాళే రిలీజ్. డాలీ దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. నలుగురు తమ్ముళ్లకు అన్నగా పవన్ నటించిన ఈ మూవీపై.. ఇప్పటికే విపరీతమైన పాజిటివ్ బజ్ తో.. టాక్ కూడా సూపర్బ్ గా వస్తోంది. మరో వైపు కాటమరాయుడుకి ప్రమోషన్స్ చేయడానికి పవన్ నో చెప్పాడనే టాక్ వినిపిస్తుండగా.. త్రివిక్రమ్ తో చేయబోయే తన తర్వాతి ప్రాజెక్టుకు  సన్నద్ధం అవుతున్నాడట పవర్ స్టార్.

పవన్-త్రివిక్రమ్ ల కాంబో అనౌన్స్ మెంట్ కూడా అయిపోయింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రం ప్రారంభానికి ముహూర్తం పెట్టేశారు. ఏప్రిల్ 7న ఈ చిత్రానికి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారట. పవన్ కూడా అదే రోజు నుంచి సెట్స్ కు  హాజరవుతాడని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా నటిస్తాడని తెలుస్తోంది. వరుస షెడ్యూల్స్ తో ఈ చిత్రాన్ని షూటింగ్ చేసేలా త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నాటికి రిలీజ్ చేసేయాలని భావిస్తున్నారంటే.. ఈ మూవీ షెడ్యూల్స్ ఏ స్థాయి టైట్ ప్లానింగ్ తో చేశారో తెలుస్తుంది.

మాటల మాంత్రికుడు రూపొందించే ఈ మూవీకి.. దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్ మొదట వినిపించినా.. దీన్ని యూనిట్ మాత్రం కన్ఫాం చేయలేదు. కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనుండగా.. హారికా హాసినీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్ర నిర్మాణం జరగనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News