లండన్‌ బయల్దేరిన తారక్‌

Update: 2015-07-04 04:00 GMT
ఎన్టీఆర్‌- సుకుమార్‌ కాంబినేషన్‌లో 'మా నాన్నకు ప్రేమతో' ఈనెల 6నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణకు వెళుతోంది. లండన్‌లో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఈరోజు ఎన్టీఆర్‌ సహా కీలకబృందం లండన్‌ బయల్దేరింది. అక్కడికి చేరుకున్న తర్వాత ఒకరోజు విరామం, తదుపరి షెడ్యూల్‌ మొదలవుతుంది. తొలి షెడ్యూల్‌ని 50రోజుల పాటు నిరాటంకంగా పూర్తి చేస్తారు. దీంతో 70శాతం షూటింగ్‌ పూర్తవుతుంది. తర్వాత మరో దేశంలో 20రోజుల పాటు మిగతా షూటింగ్‌ని ప్లాన్‌ చేస్తున్నారు. చివరిగా హైదరాబాద్‌లో అడుగుపెట్టి బ్యాలెన్స్‌ చిత్రీకరణ పూర్తి చేస్తారు. సంక్రాంతి రిలీజ్‌ లక్ష్యంగా యూనిట్‌ అహోరాత్రులు శ్రమిస్తుందని నిర్మాత బివిఎస్‌ఎన్‌ చెబుతున్నారు.

    రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ తారక్‌ సరసన నాయికగా ఆడిపాడుతోంది. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సెంటిమెంటు, ఫ్యామిలీ, యాక్షన్‌ అన్నిటినీ సమపాళ్లలో బ్లెండ్‌ చేయడానికి స్క్రిప్టు లెవల్‌లోనే సుకుమార్‌ తీవ్రంగా శ్రమించాడు. 1 నేనొక్కడినే తర్వాత ఎట్టి పరిస్థితుల్లో హిట్‌ కొట్టడమే ధ్యేయంగా ఈ స్క్రిప్టుని రాసుకున్నాడు సుక్కూ. టెంపర్‌తో ఎన్టీఆర్‌ హిట్‌ ట్రాక్‌లోకి వచ్చాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్‌కి విజయాన్ని ఇవ్వడమే కాకుండా తాను కూడా ట్రాక్‌లోకి రావాలన్నదే సుక్కూ తాపత్రయం. ఆల్‌ ది బెస్ట్‌ టు సుక్కూ.

Tags:    

Similar News