ఏడాది గ్యాప్ బ్రేక్ చేసిన నితిన్

Update: 2019-06-20 09:02 GMT
గత ఏడాది ఆగస్ట్ లో వచ్చిన శ్రీనివాస కళ్యాణం తర్వాత నితిన్ మళ్ళీ తెరమీద కనిపించలేదు. దాని ఫలితం ప్రభావమో లేక కథల విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలన్న చర్యలో భాగమో తెలియదు కానీ మొత్తానికి అభిమానులను మాత్రం చాలా వెయిటింగ్ లో ఉంచేశాడు. ఇప్పుడు దానికి బ్రేక్ పడింది. భీష్మ రెగ్యులర్ షూటింగ్ ఇవాళ్టి నుంచి మొదలైంది.

వెంకీ కుడుములు దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందుతున్న ఈ మూవీ సెట్ లో అడుగు పెట్టిన సందర్భంగా నితిన్ ఓ పిక్ ని షేర్ చేసుకున్నాడు. అయితే కేవలం తల వెనుక భాగం హెయిర్ స్టైల్ మాత్రం కనిపించేలా పిక్ పెట్టి అందులో ఫేస్ ని మాత్రం చూపించలేదు. ఏదైనా స్పెషల్ ఉందేమో ప్రస్తుతానికి సస్పెన్స్.

ఛలో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ కుడుములకు సైతం ఇది ఏడాది పైగా గ్యాప్. స్క్రిప్ట్ మీద చాలా టైం వర్క్ చేసిన వెంకీ ఫైనల్ గా మంచి ఎంటర్ టైనర్ ని తీర్చిదిద్దినట్టు తెలిసింది. ఓ పెళ్లి కానీ యువకుడి లైఫ్ ని బేస్ చేసుకున్న పాయింట్ చుట్టూ తిరిగే ఈ కథలో చాలా మలుపులు ఉంటాయట. మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్న భీష్మ విడుదలకు సంబంధించి ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అంతా ప్లానింగ్ ప్రకారం జరిగితే ఈ ఏడాది చివరిలో వచ్చే అవకాశం ఉంది


Tags:    

Similar News