నయనతార డబ్బులు అడగలేదంట...

Update: 2015-09-01 10:22 GMT
శింబు, నయనతర జంటగా పండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇదు నమ్మ ఆలు. ఈ చిత్రంలో ఓపాట కోసం డేట్స్ అడిగితే ఇవ్వలేదంటూ... నడిగర్ సంఘానికి ఫిర్యాదు చేశారు మూవీ మేకర్స్. నిజానికి ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైపోగా... ఓ వారంలో రిలీజ్ చేయగల స్థాయిలో ఉంది. కానీ చిత్ర ప్రమోషన్ కోసం.. యమ్మాడి.. అత్తాడి స్టైల్ లో ఓ ఫోక్ సాంగ్ షూట్ చేసి రిలీజ్ చేయాలని శింబు-టి.రాజేందర్ లు భావించారని, స్క్రిప్ట్ కు ఈ పాటకు సంబంధం లేకపోయినా... సినిమాకు ఏది అవసరమో మాకు తెలుసని అంటున్నారని చెప్పాడు డైరెక్టర్.

తనకు తెలిసినంతవరూకూ ఇప్పటివరకూ నయనతార 8 సార్లు డేట్స్ ఇచ్చిందని... కానీ షూటింగ్ చేయడం సాధ్యపడలేదంటున్నాడు పండిరాజ్. ఇప్పటివరకూ పాట సిద్ధం కాకపోవడమే కారణంగా చెప్పాడీయన. అంతేకాదు... అసలు ఈ పాట కోసం ఆమె అదనంగా  పారితోషికం డిమాండ్ చేసిందన్న ఆరోపణను కూడా తోసిపుచ్చాడీయన. అసలు ఆమెకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ కూడా ఇంకా పెండింగ్ లో ఉందని.. కొత్త పాటకు చిత్రీకరణకు రూపాయి కూడా అడగలేదని వివరణ ఇచ్చాడు పండిరాజ్.

తన కేరక్టర్ షూటింగ్ ను 25 రోజుల్లో పూర్తి చేసిన తర్వాత కూడా 8సార్లు డేట్స్ ఇచ్చినా.. ఇప్పుడు ఆమెపై ఫిర్యాదు చేశారని వివరణ ఇచ్చాడు దర్శకుడు. సినిమా రిలీజైతే చాలని, తనకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా అడగబోనని, ఇకపై ఒక రోజు కూడా అదనంగా షూటింగ్ కు కేటాయించబోనని... నడిగర్ సంఘానికి నయనతార వివరణ ఇచ్చిందట. ఇదేదో పాత కథలు మనసులో పెట్టుకుని ఉద్దేశ్యపూర్వకంగా వేధిస్తున్నట్లుంది కదూ.
Tags:    

Similar News