బాబు మనవడి కోసం రోడ్ బ్లాక్ చేసేశారు

Update: 2017-03-22 06:44 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యయంత్రి నారా చంద్రబాబు నాయుడికి తన మనవడు దేవాన్ష్ అంటే ఎంతిష్టమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ చాలా సీరియస్ గా కనిపించే చంద్రబాబు.. తన మనవడి దగ్గరికెళ్తే చిన్న పిల్లాడైపోతుంటారు. తాజాగా దేవాన్ష్ రెండో పుట్టిన రోజు వేడుకల్ని బాబు కుటుంబం చాలా గ్రాండ్ గా నిర్వహించింది.

హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో మంచు విష్ణు సతీమణి నడిపే న్యూయార్క్ అకాడమీ కిడ్స్ సెంటర్లో దేవాన్షన్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ అకాడమీ ఉన్న రోడ్ నంబర్ 39ను మూసివేయడం గమనార్హం. చంద్రబాబు భద్రత దృష్ట్యా సెక్యూరిటీ సిబ్బంది ఆ రోడ్ ను బ్లాక్ చేశారు. చంద్రబాబు తన కుటుంబంతో కలిసి నాలుగు గంటలకు పైగా అక్కడే ఉన్నారు. దీంతో సామాన్య జనాలకు కొంచెం ఇబ్బంది ఎదురైంది.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. నారా లోకేష్-బ్రాహ్మణి దంపతులతో పాటు నందమూరి కుటుంబానికి చెందిన పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దాదాపు 200 మంది దాకా అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు. చంద్రబాబు ఇక్కడ అతిథులతో మాట్లాడుతూ ఉల్లాసంగా గడిపారట. అతిథులందరికీ ప్రత్యేక బహుమతులు అందజేశారు. సెక్యూరిటీ సిబ్బందికి కూడా కానుకలు అందాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News