కుర్రహీరోలు లార్డ్స్‌లా ప్రవర్తిస్తున్నారు

Update: 2015-06-30 07:39 GMT
టాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ మంచు మోహన్‌బాబు ఏం మాట్లాడినా ముక్కుసూటిగా ఉంటుంది. ఒకప్పుడు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లతో పోటీపడుతూ క్రమశిక్షణ పాటించిన నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన నవతరం హీరోల తీరుతెన్నులపై ఫైరయ్యారు. కుర్రహీరోల ప్రవర్తని తప్పుబడుతూ తూర్పారబట్టారు. 'ఇప్పుడొస్తున్న హీరోలంతా సీనియర్ల మాట వినడం లేదు. ఎవరికి వారు బాసుల్లాగా ఫీలైపోతున్నారు. ఒక్క సినిమా హిట్టవ్వగానే ఓ రాష్ట్రానికి సీఎం అయిపోయినట్టు ఇదైపోతున్నారు. అందుకే నేనెవరికీ సలహాలు ఇవ్వదలుచుకోలేదు'' అంటూ సీరియస్‌ అయ్యారు.

అలాగే కథానాయికల విషయాన్ని ప్రస్థావిస్తూ.. ఒకప్పుడు కలిసి నటించిన హీరోయిన్‌ ఆ తర్వాత చాలా కాలం తర్వాత కనిపించినా విష్‌ చేసి, కుటుంబ సభ్యుల యోగ క్షేమాల్ని అడిగి తెలుసుకునేవాళ్లం. కానీ ఇప్పుడలా లేదు. అస్సలు స్నేహసద్భావన ఎవరికీ లేనేలేదు.. అంటూ తిట్టిపోశారు. నిజమే ఎవరికి వారే బాసుల్లా చెలామణి అయిపోవడం వల్లే కొందరు కుర్రహీరోలు దాదాపు ఖాళీ అయిపోయే పరిస్థితికి వచ్చేశారు. క్రమశిక్షణా రాహిత్యం వల్ల దాదాపు కెరీర్‌ ముగిసిపోయే పరిస్థితికి వచ్చారు కొందరు. కథానాయికలు సైతం ఇలా కనిపించి అలా గోడకు కొట్టిన బంతుల్లా వెళ్లిపోతున్నారు. ఇదే విషయంపై మోహన్‌బాబు గురువు దాసరి నారాయణరావు కూడా పలు వేదికలపై బహిరంగంగానే ఫైరైన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News