ఫ్యాన్స్‌ కోరుకున్నట్లుగా మెగాస్టార్‌ సోషల్‌ మీడియా జర్నీ

Update: 2020-04-20 10:30 GMT
ఫిల్మ్‌ స్టార్స్‌ ను లక్షల్లో అభిమానులు సోషల్‌ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు. వారు పెట్టే పోస్ట్‌ ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు. టాప్‌ స్టార్స్‌ లో చాలా తక్కువ మంది మాత్రమే రెగ్యులర్‌ గా పోస్ట్‌ లు పెడుతూ ఉంటారు. కొందరు అయితే వారానికి ఒకటి నెలకు ఒకటి అన్నట్లుగా పోస్ట్‌ లు పెడుతూ ఉంటారు. వారంలో కనీసం రెండు మూడు అయినా పోస్ట్‌ లు పెట్టాలని ఫ్యాన్స్‌ కోరుకుంటారు. వారి వ్యక్తిగత విషయాలు.. అభిప్రాయాలు.. సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని షేర్‌ చేసేందుకు చాలానే ఉంటాయి. కాని ఎక్కువ మంది స్టార్స్‌ మాత్రం షేర్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపించరు.

తాజాగా సోషల్‌ మీడియాలో జాయిన్‌ అయిన మెగాస్టార్‌ చిరంజీవి ఏ రకంగా తన జర్నీని కొనసాగిస్తాడో అని అంతా అనుకున్నారు. చిరంజీవి కూడా పెద్దగా పోస్ట్‌ లు పెట్టక పోవచ్చు అనుకున్నారు. కాని మెగాస్టార్‌ మాత్రం మొదటి రోజు నుండి నిన్నటి వరకు వరుసగా పోస్ట్‌ లు పెడుతూనే ఉన్నాడు. ట్విట్టర్‌.. ఇన్‌ స్టా ఇలా సోషల్‌ మీడియాలో కుమ్మేస్తున్నాడు. సినిమాల గురించి.. ఫ్యామిలీ గురించి.. ఛారిటీ ఇలా ప్రతి ఒక్క విషయాలపై స్పందిస్తూ ట్విట్స్‌ చేస్తున్నాడు.

మెగాస్టార్‌ నుండి వరుసగా పోస్ట్‌ లు వస్తున్న నేపథ్యం లో ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. ఆయన్ను ఫాలో అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటున్నారు. చిరంజీవి రెగ్యులర్‌ గా పోస్ట్‌ లు చేయడం వల్ల ఆయన మా మద్యలో ఉన్నట్లుగా ఉందని.. ఆయన తరహాలో ఇతర స్టార్స్‌ కూడా రెగ్యులర్‌ గా ట్వీట్స్‌ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంను కొందరు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్‌ సోషల్‌ మీడియా జర్నీపై మెగా ఫ్యాన్స్‌ వందకు రెండు వందల శాతం సంతృప్తిగా ఉన్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగాలని వారు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News