చైతూ హీరోయిన్ కు ఒళ్లు మండి..

Update: 2017-05-14 11:04 GMT
మాంజిమా మోహన్ గుర్తుంది కదా. అక్కినేని నాగచైతన్య లాస్ట్ మూవీ ‘సాహసం శ్వాసగా సాగిపో’లో కథానాయికగా నటించిన మలయాళ కుట్టినే ఈ మాంజిమా. ‘సాహసం..’ ఫ్లాపవడంతో ఆమె తెలుగు జనాల మనసుల్లో పెద్దగా రిజిస్టరవ్వలేదు. ఈ అమ్మాయికి సోషల్ మీడియాలో ఉండే జనాలకు అస్సలు పడదు. మలయాళంలో మాంజిమా నటించిన ఓ సినిమాలో ఆమె నటన గురించి అప్పట్లో దారుణమైన కామెంట్లు పడితే.. చాలామందితో గొడవలు పెట్టేసుకుందీ అమ్మాయి. తాజాగా మరోసారి ఎవరో ఆకతాయిలు చేసిన కామెంట్లకు బదులిచ్చి వార్తల్లోకెక్కింది మాంజిమా.

హీరోయిన్లను న్యూడ్ గా చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడతారంటూ ఎవరో కామెంట్ చేస్తే.. మాంజిమాకు ఒళ్లు మండిపోయింది. సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్లు మామూలే కదా అని లైట్ తీసుకోకుండా ఆ కామెంట్ చేసిన వ్యక్తిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసింది మాంజిమా. హీరోయిన్లను నగ్నంగా చూడ్డానికే జనాలు థియేటర్లకు రారని.. మంచి కథ ఉంటే ఆటోమేటిగ్గా సినిమా చూస్తారని ఆమె వ్యాఖ్యానించింది. హీరోయిన్ల ఎక్స్ పోజింగ్.. వాళ్లు వేసుకున్న చిట్టి పొట్టి దుస్తుల వల్ల సినిమాలు ఆడేయవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె అంది. మాంజిమా వ్యాఖ్యలతో కొందరు ఏకీభవిస్తే.. ఇంకొందరు మాత్రం హీరోయిన్ అందాలు సినిమాకు చాలా కీలకం.. నువ్వెన్ని చెప్పినా మేం హీరోయిన్లను అలా చూడ్డానికే ఇష్టపడతాం అని వాదించారు. ఇది పెద్ద చర్చగా మారుతుండటంతో మాంజిమా తర్వాత ఏమీ స్పందించకుండా సైలెంట్ అయిపోయింది.

Similar News