మళ్లీ ఆమెతో గౌతమ్ మీనన్ సాహసం

Update: 2016-09-23 11:30 GMT
గౌతమ్ మీనన్ సినిమాలకు.. ఆయన తీసుకొచ్చే హీరోయిన్లకు బోలెడంత క్రేజ్ ఉంటుంది. ప్రొఫెషన్ పరంగా సినిమాటోగ్రాఫర్ అయిన ఈయన.. తమను అద్భుతంగా ప్రజెంట్ చేస్తాడని హీరోయిన్లు నమ్ముతుంటారు. ఇప్పుడు మలయాళ కుట్టి మంజిమా మోహన్ కు.. గౌతమ్ మీనన్ వరుసగా రెండో ఆఫర్ ఇస్తున్నాడనే న్యూస్ హాట్ టాపిక్ అయిపోయింది.

ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. తమిళ్ లో శింబు.. తెలుగులో చైతు ఈ సినిమాలో హీరోలుగా నటించగా.. రెండు భాషల్లోనూ హీరోయిన్ గా మంజిమా మోహన్ చేసింది. ఇది ఫినిషింగ్ దశలో ఉండగానే.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసేశాడు గౌతమ్ మీనన్. తన మల్టీ లింగ్యువల్ ప్రాజెక్టులో పృథ్వీరాజ్.. పునీత్ రాజ్ కుమార్.. సాయి ధరం తేజ్.. అనుష్క.. తమన్నాలు నటిస్తారని చెప్పిన గౌతమ్ మీనన్.. ఈ సినిమాలోకి మంజిమా మోహన్ ను కూడా తీసుకుంటున్నట్లు ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు.

అయితే.. ఈ ఆఫర్ ని ఇంకా నేరుగా చెప్పలేదంటోంది మంజిమా. 'గౌతమ్ మీనన్ కు ఆ ఉద్దేశ్యం ఉందని నాకు కూడా టీవీ ఇంటర్వ్యూ చూశాకే అర్ధమైంది. మా మధ్య ఈ విషయంపై ఇంకా చర్చలు జరగలేదు' అంటోంది మంజిమా మోహన్.
Tags:    

Similar News