మనోజ్ తో సమానంగా కనిపిస్తాడట

Update: 2017-10-18 17:39 GMT
మంచు మనోజ్ కెరీర్ లో చాలా రోజుల తర్వాత ఒక సరికొత్త చిత్రం రాబోతోంది. ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఈ కుర్ర హీరో సరైన బాక్స్ ఆఫీస్ హిట్ ని అందుకోవడం లేదు. అయితే ఈ సారి ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని మనోజ్ ఒక్కడు మిగిలాడు సినిమాతో రాబోతున్నాడు. మంచి కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉంది. '

అయితే మనోజ్ దీపావళి సందర్బంగా సినిమాకి సంబందించి ఒక పోస్టర్ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్ లో మంచు మనోజ్ తో పాటు సినిమాలో కీలక పాత్ర పోషిస్తోన్న అజయ్ ఆండ్రూ కూడా ఉన్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు అతనే. అజయ్  ఈ సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో కనిపిస్తున్నాడట. అంతే కాకుండా సినిమాలో తన పాత్రతో పాటు అజయ్ పాత్ర తో సమానంగా ఉంటుందని మనోజ్ తెలిపాడు.

మంచు మనోజ్ అలా చెప్పడం చూస్తుంటే.. తన సహచర నటుడిని చాలా సమానంగా చూస్తున్నాడని అర్ధమవుతోంది. ఒక్కడు మిగిలాడు సినిమా ట్రైలర్ ఇప్పటికే చాలా వరకు ఆకట్టుకొంది. శ్రీలంక సైన్యం  - ఎల్టీటీఈ మధ్య జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రెజీనా హీరోయిన్ గా  నటించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ చెయ్యాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.  
Tags:    

Similar News