అదే శ్రీమంతుడి వేదిక

Update: 2015-07-29 07:28 GMT
ఆగడు సినిమా ఫలితాన్ని మహేష్ వేదిక సాక్షిగా ఒప్పుకున్నారు. తర్వాతి సినిమాకి ఆ ఫలితం రాకుండా కొరటాల కథను నమ్మి శ్రీమంతుడిగా అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలోనూ సెల్వందన్ పేరుతో ఆగష్టు 7న విడుదల కానుంది. శ్రీమంతుడు ఆడియో వేడుకలో మహేష్ సినిమాని అభిమానుల చేతిలో పెట్టేశారు. తెలుగు వరకూ ఓకే అనిపించుకున్నా తమిళ నాట సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా మొదలు కాలేదు.

ఈనెల 31న సెల్వందన్ (తెలుగులో శ్రీమంతుడు) ఆడియో విడుదల చేయనున్నారు. మహేష్, శృతి, కొరటాల శివ, తన సంగీతంతో తెలుగు తమిళ ప్రేక్షకుల ఫేవరెట్ అయిపోయిన దేవి శ్రీ ప్రసాద్ తదితరులు హాజరవనున్నారు. మహేష్ చరిష్మా ఇక్కడ ఉన్నంతగా అక్కడ లేదన్నది ఒప్పుకుని తీరాలి. ఇదిలా వుంటే మహేష్ ప్లాన్ చేశారో, యాదృచ్చికమో కానీ ఆగష్టు 2న విడుదలవుతున్న విజయ్ పులి ఆడియో వేడుకలో మహేష్ అతిథిగా హాజరవనున్నారు. ఈ సినిమాకి సంగీతం అందించింది దేవీనే. మహేష్ చారుశీల శృతి హాసన్ విజయ్ సరసన పులి సినిమాలో నటించింది.  విజయ్ అభిమానులను లెక్కించాలంటే మరో జనాభా లెక్కల కార్యక్రమం చేపట్టినట్టే. ఆ రేంజ్ లో వస్తారు. శ్రీమంతుడు ప్రమోషన్ కి అంతక్నా కావల్సిందేముంది. ఆ రకంగా శ్రీమంతుడు వేదిక ఇదే మరి.              
Tags:    

Similar News