మెగా స్టార్ సూపర్ స్టార్.. మిగాతాదంతా చరిత్ర!

Update: 2019-12-23 06:33 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  దీంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.  జనవరి 5 వ తారీఖున ఈ సినిమా కు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు.  హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుపుతామని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.

'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి గా మెగా స్టార్ చిరంజీవి ని ఆహ్వానించారు మహేష్ బాబు.  చిరు కూడా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఛీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు.  మహేష్ ఈ ఆహ్వానం అందించేందుకు చిరు నివాసానికి వెళ్ళిన సమయంలో తీసిన ఒక ఫోటోను షేర్ చేస్తూ మహేష్ సతీమణి నమ్రత ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు.  "ఒకే రకంగా ఉండే ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు.. మిగతాదంతా చరిత్రే!! ఎల్ బీ స్టేడియం.. జనవరి 5. గుర్తుంచుకోండి"  అంటూ తన ఎగ్జైట్ మెంట్ ను అభిమానులతో పంచుకున్నారు.  ఈ ఫోటోలో మెగాస్టార్ ఏదో చెప్తూ ఉంటే సూపర్ స్టార్ ఆసక్తి గా వినడం మనం గమనించవచ్చు.

మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ 'అల వైకుంఠపురము లో' సినిమా మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' కు పోటీగా రిలీజ్ అవుతోంది.  ఇలాంటి సమయంలో మహేష్ ఇలా చిరును ఈవెంట్ కు ఆహ్వానించడం..  ఆయన కూడా హాజరవుతానని చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది.  ఫ్యాన్స్ కూడా ఇలాంటివి ఆదర్శం గా తీసుకొని ఫ్యాన్ వార్స్ మానుకుంటే అందరికీ మంచిది. ఎందుకంటే  స్టార్ హీరోల సినిమాలు అందరూ చూస్తేనే భారీ కలెక్షన్స్ వస్తాయి. అలా కాదు మా హీరో సినిమా మాత్రమే మేము చూస్తాం.. వేరే హీరోల సినిమాలు మాకెందుకు అంటే టాలీవుడ్ ముందుకు పోవడం కాదు.. వెనక్కు పోతుంది.
Tags:    

Similar News