ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్

Update: 2021-11-27 06:55 GMT
టాలీవుడ్ లో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ మధ్యకాలంలో వరుసగా సినీ ప్రముఖులు కన్నుమూస్తూ శోకసంద్రాన్ని మిగిలిస్తున్నారు. తాజాగా మరో ప్రముఖ సినీ దర్శకుడు కూడా కన్నుమూయడం గమనార్హం.

ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచాడు. కేఎస్ నాగేశ్వరరావు మరణ వార్త తెలిసి సినిమా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో కన్నుమూశారని తెలిసింది.

కేఎస్ నాగేశ్వరరావు తన సొంత ఊరి నుంచి హైదరాబాద్ వస్తుండగా కోదాడ సమీపంలో ఆయనకు ఫిట్స్ వచ్చాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. . ఆ తర్వాత మరో రెండు మూడు ఆస్పత్రులకు తీసుకెళ్లారు.

చివరగా ఏలూరులో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన కన్నుమూశారని వైద్యులు తెలిపారు. కేఎస్ నాగేశ్వరరావుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

దివంగత నటుడు శ్రీహరిని హీరోగా పరిచయం చేసింది కేఎస్ నాగేశ్వరరావునే. ‘పోలీస్’ అనే సినిమా ద్వారా శ్రీహరి హీరోగా మారారు.

దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ వద్ద అసిస్టెంట్ గా కేఎస్ నాగేశ్వరరావు కెరీర్ ను ప్రారంభించారు. ‘రిక్షా రుద్రయ్య’ సినిమాతో కేఎస్ నాగేశ్వరరావు దర్శకుడిగా మారారు. ఆయన మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు అంతా సంతాపం తెలిపారు.
Tags:    

Similar News