రివేంజ్ డ్రామాగా కొరటాల సినిమా.. రివీల్ చేసిన ఎన్టీఆర్..!

Update: 2021-11-23 10:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించక మూడేళ్లు దాటిపోయింది. చివరగా 2018 అక్టోబర్ లో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో కనిపించిన తారక్.. అప్పటి నుంచి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికే అంకితమయ్యారు.

రామ్ చరణ్ తో కలిసి చేసిన ఈ సినిమా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని తర్వాత ఎన్టీఆర్ చేయబోయే రెండు సినిమాల మీద ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో #NTR30 చిత్రానికి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇదే క్రమంలో 'కేజీయఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో తారక్ NTR31 సినిమా చేయనున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే తాజాగా ఓ ప్రముఖ మీడియా పబ్లికేషన్ తో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ తన చేయబోయే రెండు ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చారు.

కొరటాల శివతో ఓ రివేంజ్ డ్రామా చేస్తున్నానని.. 2022 ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తామని ఎన్టీఆర్ చెప్పారు. అలానే ప్రశాంత్ నీల్ దర్శకత్వం తన 31వ సినిమా చేస్తున్నానని.. 2022 అక్టోబర్ లో ప్రొడక్షన్ మొదలవుతుందని స్టార్ హీరో వెల్లడించారు. ఈ సందర్భంగా 'RRR' చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్ మాట్లాడుతూ.. ఇద్దరి లెగ్ మూవ్ మెంట్స్ పర్ఫెక్ట్ గా రావడానికి ఒక్కో స్టెప్ కోసం 15-16 టేకులు తీసుకున్నట్లు తారక్ తెలిపారు.

మొత్తం మీద మూడేళ్ళుగా వెండితెర పై కనిపించని ఎన్టీఆర్.. ఇకపై ఎక్కువ గ్యాప్ రాకుండా చేసుకుంటున్నారని తెలుస్తోంది. 2022 ప్రారంభంలో RRR చిత్రాన్ని రిలీజ్ చేయడంతో పాటుగా కొరటాల శివ - ప్రశాంత్ నీల్ చిత్రాలను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేశారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉన్న తారక్.. త్వరలోనే తిరిగి రానున్నారు.


Tags:    

Similar News