బ్యాడ్ బేబీ.. పాలరాతి శిల్పంలా పోజిస్తే..!

Update: 2020-07-01 14:30 GMT
టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కంటే బాలీవుడ్‌ ఇండస్ట్రీలో అందాల ఆరబోత డోస్ కాస్త ఎక్కువగా ఉంటుంది. అక్కడి కథానాయికలు దేనికి భయపడరు. అన్నిటికి సిద్దమై ఇండస్ట్రీలో అడుగు పెడతారు. అందులో విదేశీ భామలైతే ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. అలాంటి బాలీవుడ్ హీరోయిన్లలో ఓ విదేశీ భామ తన సత్తా చాటుతోంది. తానే శ్రీలంకకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్. బహ్రెయిన్‌ దేశంలో పుట్టి పెరిగిన ఈ వయ్యారి భామ బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. గతేడాది స్టార్ హీరో ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమాతో ఈ భామ తన అందాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ సినిమాలోని ‘బ్యాడ్ బోయ్’ సాంగ్‌లో ప్రభాస్‌తో కలిసి ఆడిపాడి సౌత్ కుర్రకారు మనసు దోచుకుంది.

ఇదిలా ఉండగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే జాక్వెలిన్ అప్పుడప్పుడు తన వయ్యారాల ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మడి అందాలకు అభిమానులు అలా పడి ఉంటారంతే. ఇంస్టాగ్రామ్ లో జాక్వెలిన్‌కు 34 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. తెల్లని ఫ్యాషన్ దుస్తులలో పాలరాతి శిల్పంలా పోజిచ్చింది. అమ్మడి హొయలకు అభిమానులు కళ్లప్పగించి చూస్తున్నారు. ఆ పిక్ లో జాక్వెలిన్ నడుము నాభి అందాలతో పాటు ఎద పొంగులను కూడా ప్రదర్శించింది. చూస్తూనే మతులు పోగొట్టుకుంటున్నారు జాక్వెలిన్ ను ఆరాధించే ప్రియులు. ఇక ఇటీవలే మిస్టర్ సీరియల్ కిల్లర్ వెబ్ సిరీస్ లో నటించింది. ఇందులో అమ్మడి అందమే కాదు మెరుపు కూడా కనిపిస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News