బరువు బాధ్యతలన్నీ కుమారి నెత్తినే

Update: 2015-11-17 04:06 GMT
కుమారి 21ఎఫ్ ఈ నెల 20న రిలీజ్ అయిపోతోంది. నిజానికి ఈ మూవీకి డేట్ ఇంత తొందరగా సెట్ అయిందంటే.. అది అఖిల్ ఇచ్చిన గ్యాప్ అనే చెప్పుకోవాలి. అఖిల్ కోసం 2 వారాల పాటు ఏ సినిమాని షెడ్యూల్ చేయకుండా గ్యాప్ ఇచ్చారు. కానీ అఖిల్ అంచనాలను అందుకోలేకపోవడం, రెండో రోజుకే థియేటర్స్ ఖాళీ అవడంతో.. రిలీజ్ కి రెడీగా ఉన్న మూవీస్ ని నవంబర్ 20కి షెడ్యూల్ చేసేశారు.  

బ్రిలియంట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన తొలి మూవీ ఇది. రాజ్ తరుణ్ - హేబా పటేల్ జంటగా నటించిన ఈ మూవీలో హీరోయిన్ రోల్ పైనే సినిమా నడుస్తుందన్న విషయం అర్ధమవుతూనే ఉంది. ట్రైలర్స్ - స్టోరీ ఓకే  కానీ.. ప్రచారం కూడా హీరోయిన్ పైనే చేయడం ఆశ్చర్యకరం. చూస్తుంటే హీరోయిన్‌ మీదనే ఎక్కువ డిపెండ్‌ అయ్యారని అర్ధమవుతోంది.  నిజానికి హీరోగా నటించిన రాజ్ తరుణ్‌ ప్రస్తుతం ఫుల్లు ఫామ్ లో ఉన్నాడు. వరుసగా రెండు సూపర్ హిట్స్ సాధించి.. సూపర్ జోష్ మీదున్న కుర్ర హీరో ఇతగాడు. కుమారి 21ఎఫ్ తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టేసి స్టార్ లీగ్ లోకి ఎంటర్ అవుతాడనే అంచనాలు  కూడా ఉన్నాయి.

కానీ పబ్లిసిటీలోనూ, ప్రమోషన్ లోనూ ఎక్కువగా హేబా పటేల్ నే యూనిట్ నమ్ముకోవడం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. అయితే.. అసలు కంటెంట్ ఏముందో తెలియదు కాని.. ఈ పిల్ల మాత్రం తెగ సెగలు రేపేస్తోంది. ప్రేక్షకులను, ముఖ్యంగా కుర్రకారుని  బాగానే ఆకట్టుకుంటోంది. అందులోనూ ఏ సర్టిఫికేట్ సినిమా కావడంతో.. యూత్  లో క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. చూద్దాం కుమారి ఈ భారాన్ని ఎంతవరకూ మోయగలదో.


Tags:    

Similar News