నలుగురు వదినల మధ్యలో చెర్రీ

Update: 2018-01-22 17:02 GMT
మెగా హీరో రామ్ చరణ్ ధ్రువ తరువాత థియేటర్లలో సందడి చేసింది లేదు.  త్వరలో రంగస్థలం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తుండగా...  బోయపాటితో  మరో సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేశాడు. తాజా సమాచారం ప్రకారం బోయపాటి సినిమాలో చెర్రీ సెంటిమెంట్ సీన్లు పండించబోతున్నాడు.

ఎందుకంటే అందులో నలుగురు వదినల ముద్దుల మరిదిగా కనిపించబోతున్నాడు. పెద్ద వదినగా స్నేహ, రెండో వదినగా జర్నీ ఫేం అనన్య నటించబోతున్నారు. ఇక మూడు, నాలుగు స్థానాల్లో  హిమజ, ప్రవీణ కనిపించబోతున్నారు.  ఈ తారాగణం చూస్తుంటే వదినల సెంటిమెంట్ భారీ స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తోంది.  సరైనోడు, జయజానకీనాయక సినిమాలలో కూడా బోయపాటి సెంటిమెంట్ సీన్లను పండించాడు. ఇప్పుడు నలుగురు వదినలు, నలుగురు అన్నయ్యలను పెట్టడం ద్వారా చెర్రీని మరింతగా కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేయబోతున్నాడు బోయపాటి.  స్క్రిప్ట్ నిండా సెంటిమెంట్ సీన్లే ఉన్నా ఆశ్చర్యపోనక్కరలేదు.

సిస్టర్ సెంటిమెంట్ బోరుకట్టిందేమో... సిస్టర్ ఇన్ లా సెంటిమెంట్లను తెరపై ఆవిష్కరిస్తున్నారు మన దర్శకులు. మొన్న విడుదలైన నాని సినిమా ఎంసీఏలో కూడా వదిన మరిదిల పాత్రలు, వాటి మధ్య వచ్చే సన్నివేశాలే ప్రధాన పాత్ర వహించాయి. ఇప్పుడు బోయపాటి ఏకంగా నలుగురు వదినలను తెరపై దించుతున్నారు.  ఈ సినిమాలో భారీ తారాగణమే కనిపిస్తోంది. కైరా అద్వాణీ హీరోయిన్ గా - తమిళ నటుడు ప్రశాంత్ - బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.  ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. ఫిబ్రవరిలో సెకండ్ షెడ్యూల్  ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్.
Tags:    

Similar News