న్యూ డిస్కవరీ.. పదునైన అందాలు

Update: 2015-07-10 13:58 GMT
డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఇప్పటికే బోలెడుమంది కథానాయికల్ని, నటీమణుల్ని తెలుగు తెరకి పరిచయం చేశాడు. ఇందులోంచి అనుష్క, హన్సిక, అశిన్‌, అదాశర్మ.. అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్లుగా ఎదిగేశారు. కోటి పైగా పారితోషికం అందుకునే కథానాయికలుగా పాపులర్‌ అయ్యారు. ముమైత్‌ సహా బోలెడుమంది ఐటెమ్‌ భామల్ని కూడా తెలుగు తెరకి పరిచయం చేసిన ఘనుడు పూరీ. అందుకే అతడు ఓ కొత్త కథానాయికని తెరకి పరిచయం చేస్తున్నాడంటే అందరిలోనూ ఆసక్తి పెరుగుతుంది.

        ఈసారి ఆఫర్‌ దిషా పటాని అనే ముంబై మోడల్‌కి దక్కింది. లోఫర్‌ సినిమాలో అమ్మడు మెగా బ్రదర్‌ కొడుకు వరుణ్‌ తేజ్‌తో సందడి చేయనుంది. అమ్మడికి ఇది నిజంగానే గొప్ప అవకాశం. ఆరంభమే పూరి లాంటి కమర్షియల్‌ డైరెక్టర్‌ చేతిలో పడింది. నాయికల్ని 100పర్సంట్‌ గ్లామరస్‌గా ఆవిష్కరించే చాకచక్యం పూరికి ఉంది కాబట్టి అది తనకి పెద్ద ప్లస్‌ అవుతుంది. పైన చూస్తున్నారుగా.. అమ్మడు ఎంత చాకచక్యంగా తన అందాలను ఆవిష్కరిస్తోందో.. డిజైనర్‌ బ్రా నుండి కోర్సెట్‌ వంటి హాటు హాటు లింగరీలు ధరించి అమ్మడు మోడలింగ్‌ ప్రపంచానికి తన పదునైన గ్లామర్‌ తాలూకు ఘాటును పరిచయం చేస్తోంది. ఆస్వాధించండి మరి.

Tags:    

Similar News