ఆ సినీ నటి అంత పని చేసిందా? బంజారాహిల్స్ లో కేసు నమోదు

Update: 2020-07-23 04:45 GMT
ఒక ఐటీ ఉద్యోగిని పట్ల సినీ నటి దురుసుగా వ్యవహరించిన వైనం హైదరాబాద్ లో చోటు చేసుకుంది.  అంతేకాదు.. బంజారాహిల్స్ లో పోలీస్ స్టేషన్ లో సదరు నటిపై కేసు నమోదైంది. ఇంతకూ సినీ నటికి.. ఐటీ ఉద్యోగినికి మధ్య లడాయి ఎక్కడ షురూ అయ్యిందన్న వివరాల్లోకి వెళితే..

బిల్డింగ్ సెక్యురిటీ పని చేస్తున్న లక్ష్మీ అనే మహిళను సినీ నటి రాధ ప్రశాంతి కారు ఢీ కొట్టింది. పెద్దగా శబ్ధంగా వినిపించటంతో స్థానికంగా ఉండే మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బయటకు వచ్చి చూశారు. సదరు మహిళపై సినీ నటి రాధ ప్రశాంతి.. మరొకరు దాడి చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె తన సెల్ ఫోన్ లోని కెమేరాలో చిత్రీకరించారు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా రాధ ప్రశాంతి.. సదరు ఐటీ ఉద్యోగిని పట్ల దురుసుగా వ్యవహరించినట్లుగా ఆరోపిస్తున్నారు. ఐటీ ఉద్యోగిని సెల్ ఫోన్ లాక్కొని.. దాన్ని ధ్వంసం చేయటమే కాదు.. ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించినట్లుగా చెబుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాధ ప్రశాంతిపైనా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Tags:    

Similar News