దేవిశ్రీ అక్కడా రచ్చ రచ్చే..

Update: 2015-08-03 11:46 GMT
దేవిశ్రీ  ప్రసాద్ వచ్చాడంటే స్టేజ్ దద్దరిల్లి పోవాల్సిందే. అతడు చేసే హంగామా మామూలుగా ఉండదు. పాటలతో, మాటలతో మొత్తం ఆడిటోరియాన్ని ఉర్రూతలూగించేయడం అతడికి మాత్రమే సాధ్యమైన విద్య. మొన్న ‘శ్రీమంతుడు’ ఆడియో సందర్భంగా ఎంత సందడి చేశాడో చూశాం. తాజాగా అతడి ఫోకస్ చెన్నైపై పడింది. నిన్న, ఆదివారం దేవిశ్రీ పుట్టిన రోజు. తమ సినిమాకు అద్భుతమైన పాటలిచ్చాడన్న సంతోషంలో అతడి పుట్టిన రోజు నాడే ఆడియో ఫంక్షన్ ఏర్పాటు చేసి దేవిశ్రీని గౌరవించింది ‘పులి’ టీమ్. ఎప్పుడూ సంగీత సాగరంలోనే మునిగి తేలుతుంటాడు కాబట్టి.. అతడి టేస్టుకు తగ్గట్లే ఓ భారీ స్పెషల్ కేక్ రెడీ చేయించి ఆడియో వేదికలో కట్ చేయించారు.

విజయ్, హన్సిక, శ్రుతి హాసన్, శ్రీదేవి సహా పులి యూనిట్ మొత్తం వేదికెక్కి దేవిశ్రీ బర్త్ డేని ఘనంగా చేసి.. ఈ పుట్టిన రోజును అతనెప్పటికీ గుర్తుంచుకునేలా చేసింది. ఆ వేడుక కంటే ముందు దేవి వేదికనెక్కి ఎప్పట్లాగే హంగామా చేశాడు. సరదా వ్యాఖ్యానంతో పాటలతో ఆడిటోరియాన్ని ఊపేశాడు. ‘పులి’ పాటలకు కూడా అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ రివ్యూస్ లోనూ మనోడి టాలెంట్ గురించి తమిళ క్రిటిక్స్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే విజయ్, శ్రుతి పాడిన  యాండి యాండి పాట చార్ట్ బస్టర్  అయింది. ఇప్పుడు మిగతా పాటలు కూడా తమిళ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే తెలుగులోనూ ఈ పాటల్ని రిలీజ్ చేయబోతున్నారు.
Tags:    

Similar News