గ్రీన్‌ ఛాలెంజ్‌ స్వీకరించిన మరో హీరో

Update: 2020-06-18 08:30 GMT
టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కు మంచి స్పందన వస్తోంది. టాలీవుడ్‌ ప్రముఖులు ఇప్పటి వరకు ఎంతో మంది ఈ ఛాలెంజ్‌ ను స్వీకరించి చెట్లు నాటారు. ఇటీవలే టాలీవుడ్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ చెట్టు నాటడంతో పాటు అడవిని దత్తత తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ను స్వీకరించి చెట్టు నాటాడు.

కొన్ని రోజుల క్రితం బిగ్‌ బాస్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ ను స్వీకరించిన విశ్వక్‌ సేన్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌ పార్క్‌ లో చెట్టు నాటాడు. మనుషులు బతకాలంటే మొక్కలు చాలా అవసరం. సంతోష్‌ కుమార్‌ గారు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా గొప్పది అంటూ విశ్వక్‌ సేన్‌ అభిప్రాయపడ్డాడు. ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ను తాను అల్లు శిరీష్‌.. డైరెక్టర్‌ శైలేష్‌ కొలను.. అభినవ్‌ గోమఠం.. హీరో కార్తికేయలకు విసురుతున్నట్లుగా విశ్వక్‌ సేన్‌ పేర్కొన్నాడు.
Tags:    

Similar News