మిల్కీతో శిరీష్.. కుర్రాడికి ఏం పెరిగిందో!

Update: 2016-09-23 07:30 GMT
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అయినా.. అల్లు శిరీష్ కు గత నెల వరకు సరైన గుర్తింపు లేదు. గుర్తింపు సంగతి పక్కన పెడితే.. విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే.. రీసెంట్ గా వీటన్నిటికీ చెక్ పెట్టేశాడు అల్లు శిరీష్. శ్రీరస్తు శుభమస్తుతో మంచి సక్సెస్ సాధించడమే కాదు.. అటు లుక్స్ పరంగాను.. ఇటు యాక్టింగ్ పరంగాను బోలెడన్ని మార్కులు వేయించుకున్నాడు.

శ్రీరస్తు శుభమస్తు తర్వాత అల్లు శిరీష్ రేంజ్ పెరిగిపోతోంది. ఇది ఏ స్థాయిలో ఉందంటే.. ఏకంగా తమన్నాతో జట్టు కట్టేశాడు శిరీష్. ఇప్పటికైతే సినిమాలో జోడీ కట్టకపోయినా..  ప్రస్తుతం టీవీల్లో వస్తున్న ఓ యాడ్ లో వీరిద్దరూ జంటగా నటించారు. ఓ షాంపూ ప్రకటనకు చెందిన తెలుగు వెర్షన్ లో శిరీష్- తమన్నా కాంబో కనిపించింది. ఇండియా వైడ్ గా డిమాండ్ ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా.. అల్లు శిరీష్ పక్కన కనిపించడం కొంచెం ఆశ్చర్యపోయే విషయమే.

నిజానికి ఈ బ్రాండ్ కి తమన్నా హోల్ సౌత్ ఇండియాకి అంబాసిడర్ కాబట్టి.. ఒక్కో భాషలో ఒక్కోరితో కనిపిస్తోంది. కానీ ఆ కంపెనీ వాళ్లు తెలుగు వెర్షన్ కి శిరీష్ ని తీసుకోవడమే సెన్సేషనల్ అంశం. అయితే.. అప్పట్లో అల్లు శిరీష్ అరంగేట్రం చేసిన గౌరవం చిత్రంలో హీరోయిన్ గా.. తమన్నాని తీసుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి లెండి. అప్పుడు కుదర్లేదు కానీ.. ఇప్పటికి ఆ కాంబినేషన్ చూసే వీలు కలిగిందన్న మాట.

Tags:    

Similar News