క‌బాబ్ లు చాల‌వు.. చికెన్ మోమో రుచి చూస్తుంద‌ట‌!

Update: 2022-09-18 04:54 GMT
సిమ్లా మ‌నాలి టు దిల్లీ .. ఉత్త‌రాది బెల్ట్ లో ఆహార వైవిధ్యం గురించి సౌత్ లో మారుమూల తెలిసింది త‌క్కువే. తెలుగు రాష్ట్రాల్లో టాప్ 10 న‌గ‌రాల్లో పంజాబీ ఆహారం ఆరగించేవాళ్లున్నా కానీ అధికులు న‌గ‌ర‌వాసులే. ప‌ల్లెలకు ఇంకా ఈ ఫుడింగ్ విధానం అందుబాటులో లేదు.

చికెన్ క‌బాబ్ లు .. ధ‌మ్ బిరియానీలు అన్నిచోట్లా లాగించేవే అయినా చికెన్ మోమోస్.. వెజ్ మోమోస్ అంటూ కొన్నిటి గురించి అవేర్ నెస్ ఇక్క‌డ త‌క్కువ‌. కానీ మోమో ఈటింగ్ క‌ల్చ‌ర్ ఇటీవ‌ల సౌత్ లోనూ విస్త‌రిస్తోంది. ఇది సున్నిత‌త్వంతో కూడుకున్న టేస్టీ ఫుడ్ కావ‌డంతో నెమ్మ‌దిగా ఎక్కుతోంది.

ఇప్పుడు దిల్లీకి వెళ్లిన ర‌ష్మిక మంద‌న మోమో ఫెస్టివల్ గురించి ప్ర‌స్థావిస్తూ.. నోరూరించింది. ఒకేసారి రెండు మూడు సినిమాల కోసం ప‌ని చేస్తున్న ర‌ష్మిక మంద‌న ఓవైపు త‌న త‌దుప‌రి రిలీజ్ గుడ్ బై ప్ర‌మోషన్స్ చేస్తూనే వ‌రిసు షూటింగ్ కోసం వెళుతోంది. తాజాగా రష్మిక మందన్న దేశ రాజధాని లో రుచికరమైన ఆహారాన్ని ఆస్వాధిస్తోంది.

ఇటీవ‌లే గుడ్ బై ప్రమోషన్స్ కోసం రష్మిక ఢిల్లీ వెళ్లింది. నగరంలో తీరిక స‌మ‌యాల్లో అక్క‌డ ఆహారాన్ని ఆరాంగా ఆస్వాధిస్తోంది. టేబుల్ పై తాను సేవించిన ఆహారానికి సంబంధించిన ఫోటోలను ర‌ష్మిక మంద‌న‌ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దిల్లీలో ఉన్నప్పుడు..ఆన్-దాల్ మఖానీ- బటర్ చికెన్- పనీర్ భుర్జీ- సీక్ కబాబ్ - మకై ది రోటీ- దహీ కబాబ్... నేను చాలా ఆర్డర్ చేశాను! అంటూ సంబ‌రంగా చెప్పింది ర‌ష్మిక‌. ఢిల్లీ నుండి రిట‌న్ అవుతూ..ధన్యవాదాలు ఢిల్లీ.. చాలా స్వీట్ గా ఉన్నారు! మ‌రోసారి ``మోమో డేట్ కోసం వెళ్దాం`` అంటూ నోరూరించే ట్వీటేసింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. పుష్ప 2 -యానిమల్ -మిషన్ మజ్ను లాంటి చిత్రాల‌తో బిజీ బిజీగా ఉంది. ద‌ళ‌ప‌తి విజయ్ తో `వరిసు`లో న‌టిస్తోంది. సౌత్ లో ప‌లు భారీ ఆఫ‌ర్లు ర‌ష్మికకు ఉన్నా సంత‌కాలు చేసేందుకు వెయిటింగులో ఉంచింద‌ని స‌మాచారం.
Tags:    

Similar News