అయ్యో ర‌ష్మికా! ఇలా అయ్యిందేమిటీ?

Update: 2022-11-20 13:30 GMT
టాలీవుడ్ లో అదృష్టం ప‌రీక్షించుకుని బాలీవుడ్ లో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరిన సౌత్ భామ‌లకు ఆశించిన‌ది ద‌క్కుతోందా? అంటే లేనే లేద‌ని చెప్పాలి. అశిన్- త్రిష‌- కాజ‌ల్ -త‌మ‌న్నా లాంటి భామ‌ల‌కు హిట్ సినిమాలు ఉన్నా వీళ్ల‌కు అక్క‌డ ఆద‌ర‌ణ త‌క్కువ. ఇలియానా ఆరంభం బ‌ర్ఫీ లాంటి అవార్డ్ చిత్రంలో న‌టించినా కానీ త‌న‌కు బాలీవుడ్ క‌లిసి రావ‌డం లేదు. ఈ భామ‌ల్ని కేవ‌లం తెలుగు త‌మిళ నాయిక‌లుగానే ఉత్త‌రాది ఆడియెన్ రిసీవ్ చేసుకున్నారు. అందువ‌ల్ల అక్క‌డ ఆశించినంత‌గా ఎద‌గ‌లేదు. కానీ నాయికా ప్ర‌ధాన చిత్రాల‌తో తాప్సీ బాలీవుడ్ లో బాగానే పాగా వేసింది.

ఇక శ్రీ‌వ‌ల్లిగా పాపుల‌రైన ర‌ష్మిక మందన బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ ఆఫ‌ర్ల‌తో ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ఇప్ప‌టికిప్పుడు అక్క‌డ అర‌డ‌జ‌ను సినిమాల‌కు క‌మిటైంది. ఇందులో అమితాబ్ తో గుడ్ బాయ్ ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డం ర‌ష్మిక‌ను నిరాశ‌ప‌రిచింది. అయితే క‌నీసం సిద్ధార్థ్ మ‌ల్హోత్రా స‌రస‌న న‌టిస్తున్న `మిషన్ మజ్ను` తనని ఆదుకుంటుంద‌ని ర‌ష్మిక భావించింది. ఈ సినిమా థియేట్రిక‌ల్ గా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ సాధిస్తే త‌న ద‌శ దిశ తిరిగిపోతాయ‌ని ర‌ష్మిక  భావించింది. కానీ అది సాధ్య‌మ‌వుతుందా? అంటే స‌సేమిరా అని తేలిపోయింది.

ర‌ష్మిక సినిఆమా వచ్చే ఏడాది డిజిటల్ విడుదలపై దృష్టి సారిస్తోంద‌ని తాజా క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రా - రష్మిక మందన్న నటించిన మిషన్ మజ్ను స్పై థ్రిల్లర్ కావ‌డంతో ఇది న‌టీన‌టుల‌కు పేరు తెస్తుంద‌ని అంచ‌నాలేర్ప‌డ్డాయి. కానీ మిషన్ మజ్ను నేరుగా OTTలో విడుదల కానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.  మిషన్ మజ్ను పాకిస్తాన్ లో భారతదేశ RAW ఆపరేషన్ ఆధారంగా ఒక ఛాలెంజింగ్ కథను వివరిస్తుంది. సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన మిషన్ మజ్ను వచ్చే ఏడాది డిజిటల్ విడుదలపై దృష్టి సారిస్తోంది రిపోర్ట్

తాజా నివేదిక ప్రకారం.. స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ మునుముందు రోజుల్లో దీని గురించి ప్రకటన చేయనుంది. నెట్ ఫ్లిక్స్ లో జనవరి 18న చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువ‌డ‌నుంద‌ని తెలుస్తోంది. అయితే మేకర్స్ లేదా స్ట్రీమింగ్ దిగ్గజం దానిని ధృవీకరించడానికి అధికారిక ప్రకటన చేసే వరకు.. సమాచారం కేవ‌లం క‌ల్పితంగా భావించాల్సి ఉంటుంది.

సిద్ధార్థ్ మల్హోత్రా విషయానికి వస్తే.. వాస్తవానికి ఈ చిత్రం డిజిటల్ విడుదలను పొందినట్లయితే అది OTT లో సిధ్ కి  రెండవ చిత్రం అవుతుంది. ప్రైమ్ వీడియోలో విడుదలైన `షేర్షా` తక్షణ హిట్ అయింది. అక్టోబరు 25న థియేటర్లలో విడుదలైన థాంక్ గాడ్ లో సిద్ధార్థ్ చివరిసారిగా కనిపించాడు. అతనితో పాటు ఈ చిత్రంలో అజయ్ దేవగన్ - రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటించారు. కామెడీ-డ్రామా బాక్సాఫీస్ వద్ద పేలవంగా ప్రదర్శిత‌మైంది.

ప్రస్తుతం సిధ్ త‌న త‌దుప‌రి భారీ యాక్ష‌న్ చిత్రంలో న‌టిస్తున్నాడు. దర్శకుడు రోహిత్ శెట్టితో తొలి ప్ర‌య‌త్న‌మిది. ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్ తో శెట్టి తన డిజిటల్ ఆరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం సిద్ ఢిల్లీలో ఓ షెడ్యూల్‌ షూటింగ్ లో ఉన్నాడు. ఈ వెబ్ సిరీస్ లో శిల్పాశెట్టి కూడా ఒక ప్రముఖ పాత్రలో నటించనుంది. మిష‌న్ మ‌జ్నుపై ర‌ష్మిక చాలా ఆశ‌లు పెట్టుకుంది. కానీ ఇది థియేట్రిక‌ల్ రిలీజ్ కాకుండా ఓటీటీలో వ‌చ్చేస్తుంద‌ని ప్ర‌క‌టించ‌డం తీవ్రం గా నిరాశ‌ప‌రిచేదే.
Tags:    

Similar News