కలకలం రేపుతున్న ఆ సినిమా పోస్టర్

Update: 2017-12-11 09:31 GMT
తమిళనాట ఇప్పుడో సినిమా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అదే.. తమిళ్ పడం-2. అల్లరి నరేష్ సినిమా ‘సుడిగాడు’ మాతృక ‘తమిళ్ పడం’కు ఇది సీక్వెల్. రెండు రోజుల కిందటే సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్ వైరల్ అయింది. పోస్టర్ మీద థియేట్రికల్ రిలీజ్ డేట్ తో పాటు పైరసీ వెబ్ సైట్లో రిలీజ్ డేట్ అంటూ కూడా ప్రకటించి సంచలనం రేపింది చిత్ర బృందం. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ మరింత వైరల్ అవుతోంది. ‘తమిళ్ పడం’లో హీరోగా నటించిన శివనే ఇందులో కూడా కథానాయకుడిగా నటిస్తున్నాడు. అతను తెల్లటి దుసుల్లో కింద కూర్చుని ధ్యానం చేస్తున్నట్లుగా ఉన్న పోస్టర్ లాంచ్ చేశారు.

ఇది చూడగానే అందరికీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమే గుర్తుకొస్తున్నాడు. గత ఏడాది జయలలిత మరణానంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం.. శశికళకు సీఎం పదవిని ఇచ్చేయాల్సిన పరిస్థితుల్లో పన్నీర్.. జయలలిత సమాధి దగ్గరికి వెళ్లి ఇలాగే కూర్చుని గంట సేపు ధ్యానం చేయడం.. ఆ తర్వాత శశికళకు వ్యతిరేకంగా గళం వినిపించడం తెలిసిందే. అప్పట్లో ఈ డ్రామా పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పుడు ‘తమిళ్ పడం-2’ హీరో కూడా ఇలాగే కూర్చోవడం చర్చనీయాంశమవుతోంది. ‘తమిళ్ పడం’ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళ సినిమాలు.. హీరోల తీరు మీద అందులో చాలా సెటైర్లు పడ్డాయి. ఇప్పుడు రాజకీయాలు.. పోలీస్ వ్యవస్థ మీద సెటైరికల్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.
Tags:    

Similar News