వరుస బయోపిక్ లతో తెలుగు ప్రేక్షకులకు ఊపిరాడనివ్వడం లేదు. ఆర్జీవీ లాంటి స్టార్ డైరెక్టర్ సంఘంలో వివాదాస్పదులైన ప్రముఖుల జీవితాల్ని అస్సలు వదిలి పెట్టడం లేదు. నిరంతరం ఏదో ఒక వివాదం క్రియేట్ చేస్తూ ఏటీటీ సినిమాల పేరుతో వరసగా లఘు సినిమాల్ని తీసి వదులుతున్నారు. ఆయన స్ఫూర్తితో చాలా మంది యువతరం దర్శకులు అదే బాటలో వెళుతుంటే ఆందోళన వ్యక్తమవుతోంది. క్వాలిటీ సినిమా అంతం మొదలైందన్న ఆవేదన టాలీవుడ్ ప్రముఖుల్ని నిలవనీయడం లేదు.
అదంతా సరే కానీ.. తాజాగా దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ బయోపిక్ ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధమవుతోందని తెలిసింది. గ్లామరస్ డాళ్ గా ఆర్తి కెరీర్ ఆరంభం సహా విషాద జీవితంపై బయోపిక్ తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
ఆర్తి కెరీర్ జర్నీని పరిశీలిస్తే.. 2001లో వెంకటేష్ సరసన `నువ్వు నాకు నచ్చావ్` చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆరంగేట్రమే ఘనవిజయం అందుకుంది. తనదైన అందం నటనతో మైమరిపించింది. గ్లామరస్ నాయికగా యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించింది. ఆ తర్వాత తరుణ్ సరసన `నువ్వు లేక నేను లేను` చిత్రంలో నటించింది. చిరంజీవి- నాగార్జున- బాలకృష్ణ లాంటి సీనియర్లు.. అలానే మహేష్ - ఎన్టీఆర్- ప్రభాస్ లాంటి అగ్ర హీరోల సరసన నటించింది.
అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆర్తి లవ్ ఫెయిల్యూర్ వ్యవహారం ప్రముఖంగా వార్తల్లోకొచ్చింది. ఓ ప్రముఖ టాలీవుడ్ యువహీరోని ప్రేమించి అటుపై బ్రేకప్ అవ్వడంతో మానసికంగా కుంగుబాటుకు లోనైంది. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయింది. తిరిగి కొంత గ్యాప్ తర్వాత హీరోయిన్ గా కంబ్యాక్ అయ్యింది.
దురదృష్టవశాత్తు కోల్పోయిన అందాన్ని తిరిగి తెచ్చుకునేందుకు శస్త్ర చికిత్సలను ఆశ్రయించింది ఆర్తి. శరీరం నుంచి ఫ్యాట్ ని తొలిగించే లిపోసక్షన్ శస్త్రచికిత్స అనంతరం గుండె నొప్పి కారణంగా ఆర్తి ప్రాణాలు కోల్పోయింది. 2015 జూన్ లో ఆర్తి తుది శ్వాస విడిచింది. 2016 లో ఆర్తి మరణానంతరం విడుదలైన ఆమె చివరి చిత్రం రిలీజైంది. అయితే ఆర్తి బయోపిక్ కి కర్త కర్మ క్రియ ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది.
అదంతా సరే కానీ.. తాజాగా దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ బయోపిక్ ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధమవుతోందని తెలిసింది. గ్లామరస్ డాళ్ గా ఆర్తి కెరీర్ ఆరంభం సహా విషాద జీవితంపై బయోపిక్ తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
ఆర్తి కెరీర్ జర్నీని పరిశీలిస్తే.. 2001లో వెంకటేష్ సరసన `నువ్వు నాకు నచ్చావ్` చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆరంగేట్రమే ఘనవిజయం అందుకుంది. తనదైన అందం నటనతో మైమరిపించింది. గ్లామరస్ నాయికగా యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించింది. ఆ తర్వాత తరుణ్ సరసన `నువ్వు లేక నేను లేను` చిత్రంలో నటించింది. చిరంజీవి- నాగార్జున- బాలకృష్ణ లాంటి సీనియర్లు.. అలానే మహేష్ - ఎన్టీఆర్- ప్రభాస్ లాంటి అగ్ర హీరోల సరసన నటించింది.
అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆర్తి లవ్ ఫెయిల్యూర్ వ్యవహారం ప్రముఖంగా వార్తల్లోకొచ్చింది. ఓ ప్రముఖ టాలీవుడ్ యువహీరోని ప్రేమించి అటుపై బ్రేకప్ అవ్వడంతో మానసికంగా కుంగుబాటుకు లోనైంది. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయింది. తిరిగి కొంత గ్యాప్ తర్వాత హీరోయిన్ గా కంబ్యాక్ అయ్యింది.
దురదృష్టవశాత్తు కోల్పోయిన అందాన్ని తిరిగి తెచ్చుకునేందుకు శస్త్ర చికిత్సలను ఆశ్రయించింది ఆర్తి. శరీరం నుంచి ఫ్యాట్ ని తొలిగించే లిపోసక్షన్ శస్త్రచికిత్స అనంతరం గుండె నొప్పి కారణంగా ఆర్తి ప్రాణాలు కోల్పోయింది. 2015 జూన్ లో ఆర్తి తుది శ్వాస విడిచింది. 2016 లో ఆర్తి మరణానంతరం విడుదలైన ఆమె చివరి చిత్రం రిలీజైంది. అయితే ఆర్తి బయోపిక్ కి కర్త కర్మ క్రియ ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది.