కొణతాలకు విజయమ్మ నుంచి ఫోన్

Update: 2016-09-27 06:48 GMT
కొన్నాళ్లుగా ఏ పార్టీలోనూ లేకుండా రాజకీయంగా ఖాళీగా ఉంటున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నుంచి ఫోన్ వచ్చింది. అయితే... ఆమె రాజకీయ కారణాలతో ఆయనకు ఫోన్ చేయలేదు. కొణతాల వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న విషాదం నేపథ్యంలో విజయమ్మ ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. కొణతాల సతీమణి  పద్మావతి (54) గుండెపోటుకు చికిత్స పొందుతూ కన్నుమూయడంతో విజయమ్మ ఫోన్ చేసి కొణతాలను పరామర్శించారు.
   
కొణతాల సతీమణికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు తొలుత విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిన్న ఉదయం పరిస్థితి విషమించడంతో కేర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.  పద్మావతి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
   
కాగా వైసీపీలో క్రియాశీలంగా పనిచేసి ఇప్పుడు ఏ పార్టీలోనూ లేకుండా ఎందులో చేరుదామా అని చూస్తున్నారు కొణతాల. విశాఖ జిల్లాలోని పలు ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నారు. అయితే... తాజా విషాదం నేపథ్యంలోనూ జగన్ నుంచి ఫోన్ రాలేదన్న భావన ఆయన అనుచరుల నుంచి వ్యక్తమవుతోంది. కానీ... విజయమ్మ మాత్రం సమాచారం తెలిసిన వెంటనే కొణతాలకు ఫోన్ చేసి పరామర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి కొణతాలకు ఆ కుటుంబంతో మంచి సంబంధాలు ఉండడంతో విజయమ్మ పరామర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News