కేంద్రమంత్రి ఇంట్లో దొంగలు పడ్డారోచ్..

Update: 2017-02-19 05:02 GMT
ఒకప్పుడు బీజేపీకి చీఫ్ గా పని చేయటమే కాదు.. ప్రధాని మోడీకి సన్నిహితుడు.. బీజీపీ కీలక నేతల్లో ఒకరైన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇంట్లో దొంగలు పడినవైనం సంచలనంగా మారింది. కేంద్రమంత్రి ఇల్లు అంటే అల్లాటప్పాగా ఉండదు. సెక్యూరిటీ కథాకమామీషు ఉంటాయి. అయినప్పటికీ.. ఆయన ఇంట్లో దొంగలు పడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కేంద్రమంత్రి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. కేంద్రమంత్రి పీఏ మనోజ్ కుమార్ కు చెందిన ఇన్నోవా కారును దొంగలించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్వయంగా కేంద్రమంత్రి ఇంట్లో దొంగలుపడి.. ఆయన ఇంటి ముందున్నకారుతో ఉడాయించటం ఒక ఎత్తు అయితే.. కారులో ఉన్న జీపీఎస్ మాడ్యుల్ను తొలగించారు. దీంతో మంత్రిగారి పీఏ కారును ట్రేస్ చేయటం పోలీసులకు ఇబ్బందిగా మారింది.

కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. సీసీ కెమేరాల సాయంతో.. కేంద్రమంత్రి పీఏ కారు ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా.. కేంద్రమంత్రి ఇంట్లోకి దొంగలు పడి.. పీఏ కారును దొంగతనం చేసేవరకూ భద్రతా సిబ్బంది ఏంచేస్తున్నట్లు? కేంద్రమంత్రి ఇంట్లోకే దర్జాగా దొంగలు పడినప్పుడు.. సామాన్యుడి పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News