‘టైటానిక్’ శకలాలు చూడొచ్చు.. కొంచెం ఖర్చవుతుందంతే! ​

Update: 2020-11-17 04:15 GMT
‘టైటానిక్’ ప్రపంచసినీ చరిత్రం లో ఇదో గొప్ప చిత్రం. 1912వ సంవత్సరంలో ఉత్తర అట్లాంటిక్‌ లోని మంచుకొండ ను ఢీకొట్టి టైటానిక్​ షిప్​ సముద్రంలో మునిగిపోయింది.   1997లో ఈ ప్రమాదం ఆధారంగా ప్రముఖ దర్శకుడు జేమ్స్​ కామెరాన్​ ‘ టైటానిక్​’ అనే సినిమాను తెరకెక్కించాడు. అయితే చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది. ఇప్పటికి ఈ సినిమా ను ప్రజలు చూస్తుంటారు. ఆ సినిమాకు సంబంధించిన విశేషాలు తెలుసుకుంటూ ఉంటారు. 1912వలో టైటానిక్​ షిప్​ సముద్రం లో మునిగి పోగా.. 1985లో ఈ పడవకు సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి. మొత్తం 1500 మంది మరణంచినట్టు తేలింది. అయితే సినిమా విడుదలయ్యాక టైటానిక్​ షిప్​ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవడం మొదలుపెట్టింది.

ఈ సినిమాలో  నాయకా నాయికలైన లియోనార్డో డికాప్రియో, కేట్ విన్‌స్లెట్ వేర్వేరు సామాజిక వర్గానికి చెందిన వారు. టైటానిక్ ప్రయాణంలో ప్రేమించుకుంటారు. చివరకు చనిపోతారు.  ఈ సినిమా రిలీజ్​ అయ్యాక టైటానిక్​ షిప్​ గురించి చిన్నపిల్లలు సైతం మాట్లాడుకొనేవారు.  అయితే ఇప్పుడు టైటానిక్‌ శిథిలాలు సందర్శించేందుకు ఒక సంస్థ అవకాశం కల్పిస్తోంది. అయితే అందుకోసం ఒక్కరికి 1.25లక్షల డాలర్లు (రూ. 93లక్షల 15వేలు) ఖర్చు అవుతుంది. సముద్రం ఉపరితలం నుండి సుమారు 12,467 అడుగుల ప్రయాణం ప్రయాణించి యాత్ర బృందం ఓషన్ గేట్ సబ్ ఉపయోగించి లోపలికి తీసుకుని వెళ్తుంది. ‘ది టైటానిక్​ సర్వే ఎక్స్​పిడిషన్​ 2021 ప్రాజెక్ట్​’ పేరుతో తీస్తున్న డాక్యుమెంటరీ లో భాగంగా టీమ్‌ తో వెళ్లవచ్చు.

వాస్తవానికి దీనికి సంబంధించిన ఖర్చు చాలా ఎక్కువే అనిపిస్తుంది. కానీ, ఇందు లో వచ్చే ఎక్స్‌పీరియన్స్ మాత్రం అద్భుతం అని చెబుతున్నారు. టైటానిక్​ పడవ మునిగిపోయిన ప్రాంతం కెనడా లోని న్యూఫౌండ్లాండ్ తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. టైటానిక్ శిధిలాలు దాదాపు 70 సంవత్సరాలుగా ఎవరూ తాకలేదు. ప్రస్తుతం ఈ షిప్ ​కు సంబంధించిన శకలాలు చూసేందుకు ఓ సంస్థ అవకాశం కల్పించడం గమనార్హం.
Tags:    

Similar News