హిందూపురం రైల్వే ట్రాక్ మీద నాలుగు డెడ్ బాడీస్ ఎవరివి?

Update: 2019-10-15 10:57 GMT
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు డెడ్ బాడీస్.. అనంతపురం జిల్లా హిందూపురం మండలంలోని రైల్వే ట్రాక్ మీద కనిపించటం ఇప్పుడు పెను కలకలంగా మారింది. ఇంత భారీగా డెడ్ బాడీస్ రైల్వే ట్రాక్ మీద ఎందుకు వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? అసలేం జరిగింది? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

కిటిపి వద్ద రెండు.. ములుగురు వద్ద ఒకటి.. దేవరపల్లి వద్ద ఇంకొకటి ఉన్నట్లుగా గుర్తించారు. రైల్వే ట్రాక్ మీద ఉన్నవి ఎవరివి? అన్నది ఇప్పటికి తేల్లేదు. ఎక్కడైనా చంపేసి.. రైల్వే ట్రాక్ మీదకు తీసుకొచ్చి పడేశారా? లేదంటే.. ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి.

డెడ్ బాడీస్ కు సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. మొత్తంగా ట్రాక్ మీద నాలుగు డెడ్ బాడీస్ పడి ఉండటం ఇప్పడు సంచలనంగా మారింది.


Tags:    

Similar News