యూఏఈ ప్రజలకు అతి పెద్ద రిలీఫ్ అంటే బహుశా ఇదేనేమో !

Update: 2020-11-08 09:30 GMT
నిజం చెప్పాలంటే మన దేశంలో ఉండే స్వేచ్ఛ సమానత్వం, పౌరహక్కులు మరే దేశంలో లేవంటే అతిశయోక్తి కాదేమో. దేశంలోని ప్రజలందరికీ రాజ్యాంగం ప్రాథమిక హక్కులు కల్పించింది. అందువల్లే మన దేశ ప్రజలు ప్రభుత్వాలను కూడా నేరుగా విమర్శిస్తుంటారు. నేరాలు జరిగినా  కఠిన చట్టాల అమలు కూడా మన దేశంలో తక్కువే. అత్యంత పాశవికంగా హత్యలకు పాల్పడినా,  అత్యాచారానికి ఒడిగట్టినా అందుకు బలమైన సాక్ష్యాలు లున్నాసరే.. వారిపై వెంటనే తగిన చర్యలు తీసుకోరు. కోర్టులు  అన్ని స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే జైలు శిక్ష విధిస్తూ ఉంటాయి. మన దేశంలో ఉరి శిక్షలు చాలా తక్కువ. కొన్నేళ్ల కిందట పొడి శిక్షలే ఉండేవి  కాదు. అయితే ఇటీవలి కాలంలో నేరాల తీవ్రత దృష్ట్యా మళ్లీ ఉరి శిక్షలు విధించడం ప్రారంభించారు.

అయితే యూఏఈలో అలా కాదు. ప్రతి చిన్న నేరానికి అక్కడ కఠిన శిక్షలు ఉంటాయి. ఎక్కడ ఏళ్ల తరబడి జైళ్లలో  మగ్గ పెట్టేది ఉండదు. తప్పు చేసిన వెంటనే ని దారుణంగా బహిరంగంగా  నరికివేయడమో, కాళ్లు చేతులు తొలగించడమో చేస్తారు. అందుకే అక్కడి ప్రజలు నేరాలు చేయడానికి భయపడిపోతారు. చివరికి వాహనాలను డ్రైవింగ్ కూడా ఒక క్రమశిక్షణ పద్ధతిలో సాగుతూ ఉంటుంది. అందుకే అక్కడ వాహనాల ప్రమాదాలు కూడా తక్కువే. యూఏఈలో నేరం చేసిన ఏడు రోజుల్లోనే ఉరిశిక్ష అమలు చేస్తారు. ఇక మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించిన వారికి ఇక్కడ కఠిన శిక్షలు ఉంటాయి. దోషిని మక్కా వైపుగా మోకాళ్లపై కూర్చోబెట్టి బహిరంగంగా తల నరికి వేస్తారు.

 అయితే తాజాగా యూఏఈలో  ప్రభుత్వం భారీగా సంస్కరణలు చేపట్టింది. ఇస్లామిక్ చట్టాల్లో శిక్ష పరంగా తీవ్రంగా తగ్గించి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ ప్రకారం పెళ్లి చేసుకొని యువతీ యువకులు సహజీవనం చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. మద్యం కొనాలన్నా,  తీసుకోవాలన్నా,  తాగాలన్నా,  లైసెన్సు తప్పనిసరి. ఇప్పుడా నిబంధనలను ఎత్తివేసింది. బార్లు,  క్లబ్బులలో లిక్కర్ అమ్మకాలను పెంచనుంది. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి కఠిన శిక్షలను తొలగించి వాటి స్థానంలో సాధారణ శిక్షలను విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా కఠిన ఆంక్షల  మధ్య బతుకుతున్న యూఏఈ ప్రజలకు ఇది అతి పెద్ద రిలీఫ్ అని అంతటా  చెబుతున్నారు.
Tags:    

Similar News