ఫాదర్ స్టాన్ స్వామికి అవి ఇవ్వలేము : ఎన్ ఐఏ!

Update: 2020-11-27 10:10 GMT
ఫాదర్ స్టాన్ స్వామి వోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టై  ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఈ కేసు డిసెంబర్ 4న విచారణకు రానుంది. నవంబర్ 6న ఫాదర్ స్వామి తనకు పార్కినసన్ వ్యాధి ఉన్నందున గ్లాసు కూడా  పట్టుకోలేకపోతున్నానని, తలోజా జైలులో మంచినీళ్లు,టీ తాగేందుకు స్ట్రా,సిప్పర్ ఇవ్వాలని కోరుతూ ఒక పిటీషన్ దాఖలు చేశారు. అయితే ,ఫాదర్ స్టాన్ స్వామికి  ఇవ్వటానికి తమ వద్ద స్ట్రా, సిప్పర్ లేవని జాతీయ దర్యాప్తు సంస్ధ అధికారులు ప్రత్యే ఎన్ఐఏ కోర్టుకు తెలిపారు. శీతాకాలంలో  84 ఫాదర్ స్వామికి చలికి తట్టుకునేందుకు ఉన్ని దుస్తులు, స్ట్రా, సిప్పర్ వంటి సౌకర్యాలు కల్పించే విషయమై నివేదిక ఇవ్వమని కేసు విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి డీఈకొథాలికర్, వైద్యాధికారులను ఆదేశించారు.

అక్టోబర్ 22న కరోనా  వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఖైదీలక మధ్యంతర బెయిల్ ఇచ్చి విడుదల చేయాటానికి ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ ఫాదర్ స్టాన్ స్వామి పిటీషన్ ను తిరస్కరించింది. చట్టవిరుధ్దమైన కార్యకలాపాల నివారణ చట్టం ప్రకారం శిక్షార్ఙమనైన నేరానికి ఫాదర్ స్వామి పాల్పడినందును మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్పారు. అయితే  , ఫాదర్ స్వామి పార్కిన్ సన్ వ్యాధితో బాధ పడుతున్నారని, వినికిడి శక్తి కూడా కోల్పోయారని , అనేక సార్లు జైలులో పడిపోయారని. హెర్నియాకు రెండు సార్లు ఆపరేషన్ చేయించుకున్నారని, అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తుంటుందని అందువల్ల కరోనా నుంచి రక్షణకోసం స్వామికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని స్వామి పిటీషన్లో లాయర్ కోరారు. కాగా.. పిటీషనర్ వృధ్దుడు కనుక అతడ్ని జైలులోని ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచామని, ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే ప్రత్యేక చికిత్స అందిస్తామని తలోజా జైలు సూపరింటెండెంట్ చెప్పారు  రాంచీలోని అతని నివాసం నుంచి అక్టోబర్ 8వ తేదీన తీవ్ర ఉద్రిక్తతల మధ్య స్వామిని ఎన ఐ  ఏ అధికారులు అరెస్ట్ చేసి మరుసరిరోజు ముంబై తీసుకు వచ్చారు. ఆ సమయం నుండి అయన రిమాండ్ లో ఉన్నారు.
Tags:    

Similar News