ప్రార్థనల కోసం వెళ్తే పాడు పని చేసి మొహం చాటేసిన ఫాస్టర్ .. ఆ యువతికి అండగా కరాటే కల్యాణి !

Update: 2021-02-24 13:30 GMT
ప్రార్థనల కోసం చర్చి కి వెళ్తే , పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ పాస్టర్‌ తనను నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఆరోపణలు చేస్తుంది. ఈ మేరకు సినీ నటి కరాటే కల్యాణి సహాయంతో బాధితురాలు మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. పొలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన ఓ యువతి ఆల్కట్‌ తోట సమీపంలోని ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లేదట. అక్కడి పాస్టర్‌ ‌ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడని బాధిత యువతి అయన పై ఆరోపణలు చేస్తుంది.

 శారీరకంగా లోబరచుకున్న , కొంతకాలంగా తరువాత ముఖం చాటేశాడని చెప్తుంది. అలాగే  ఫోన్‌ లో  కూడా అందుబాటులో లేకపోవడంతో ఆమె చర్చికి వెళ్లి ,పాస్టర్ ‌ను నిలదీసి , పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి  చేస్తే , ఆ యువతి  నగ్న వీడియోలతో  బ్లాక్ మెయిల్‌ కు దిగాడట. అలాగే  చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు అని ఆ యువతి చెప్పుకొచ్చింది. తనకు తండ్రి లేడని, అందుకే భయపడి హైదరాబాద్‌కు వెళ్లిపోయినట్లు యువతి తెలిపింది.

ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ ఎదుట కరాటే కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ వచ్చిన బాధితురాలు ఇటీవలే తనను కలిసిందని చెప్పారు. దీంతో యువతికి ధైర్యం చెప్పి ,తొలుత షీ-టీమ్స్‌ను సంప్రదించామని , ఆ తర్వాత  షీ టీమ్స్ ఇచ్చిన సూచనల ప్రకారం.. రాజమండ్రి రెండో టౌన్ పోలీస్ స్టేషన్ ‌లో ఫిర్యాదు   చేశామని చెప్పారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Tags:    

Similar News