బ్రేకింగ్: ఆ మాజీ మంత్రి హఠాన్మరణం

Update: 2021-01-15 05:30 GMT
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య హఠాన్మరణం చెందారు. తన స్వగ్రామం చిత్తూరు జిల్లా బరాల మండలం కొత్తపల్లిలో రాత్రి సుబ్బయ్య మరణించారు. సుబ్బయ్య అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రిగా సుబ్బయ్య పనిచేశారు. ప్రస్తుతం బీజేపీలో ఆయన కొనసాగుతున్నారు. ఈయన ప్రయాణం ఈ మధ్యకాలంలో టీడీపీ, బీజేపీల మధ్య సాగింది.

గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని.. హామీ ప్రకారం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

ఆ తరుణంలో బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్న సమయంలోనే సుబ్బయ్య బీజేపీని వీడి టీడీపీలో చేరారు. అనంతరం తిరిగి గత ఏడాది జులైలో బీజేపీలో చేరిపోయారు.
Tags:    

Similar News