బ్యాంకాక్ లో ఏపీ యువకుడి మ‌ృతి

Update: 2018-08-14 10:10 GMT
విహార యాత్ర కాస్త విషాధ యాత్రగా మిగిలిపోయింది. చిన్నపాటి నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలు తీసింది.  స్విమ్మింగ్ ఫూల్ ఏపీ యువకుడిని మింగేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు బ్యాంకాక్ లో మృతిచెందాడు. ప్రమాదవశాత్తూ స్మిమ్మింగ్ ఫూల్ లో పడడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి  ఈత రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.

హైదరాబాద్ హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్న వెంకటేశ్ బ్యాంకు పని నిమిత్తం ఇటీవలే బ్యాంకాక్ కు వెళ్లాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు బ్యాంకాక్ పోలీసులు సమాచారం అందించారు. కొడుకు మరణ వార్త విన్న వింటనే తల్లిదండ్రులు భోరుమన్నారు. మృతదేహాన్ని భారత్ కు రప్పించడానికి అధికారు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకాక్ లో  వెంకటేశ్ మరణంతో స్వగృహంలో విషాధచాయలు అలుమకున్నాయి.
Tags:    

Similar News