జగన్ ఎఫెక్ట్: కేసీఆర్ టార్గెట్ మారిందా?
కరీంనగర్ లో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు తెలంగాణ సమాజంలో చర్చనీయాంశమయ్యాయి. టీఆర్ఎస్ సర్కార్ ఎక్కడ ఫెయిల్ అవుతోందో కేటీఆర్ అంగీకరించినట్టైంది.
తెలంగాణలో సీఎం కేసీఆర్ తర్వాత నంబర్ 2 అయిన ఆయన తనయుడు.. మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తే..ఇక కేసీఆర్ కూడా ఏపీ సీఎం జగన్ ను ఫాలో కావడం ఖాయమని అర్థమవుతోంది. సీఎం కేసీఆర్ టార్గెట్ మారిందని.. ఇక నుంచి రెండు అంశాలే లక్ష్యంగా ఆయన ముందుకు వెళతారని కేటీఆర్ చెప్పుకొచ్చాడు. విద్య, వైద్యరంగాలకు ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని.. విద్యుత్, తాగునీరు, సాగునీరు రంగాలకు ప్రాధాన్యం ఇచ్చామని.. ఇప్పుడు ఈ రెండు రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన ఉందన్నారు. ఇక మీదట విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తామని కేటీఆర్ తెలిపారు.
అన్ని దేశాలు ప్రజారోగ్యం విషయంలో కోట్లు ఖర్చు చేస్తుంటాయి. అదేందో భారతదేశానికి వచ్చేసరికి ఈ దరిద్రం ఎక్కువైపోయింది. సంక్షేమానికి, ఉచితాలకు వరద పారిస్తూ ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తుంటాయి మన ప్రభుత్వాలు.. మన దేశంలో విద్య, వైద్యమే అత్యంత ఖరీదైనవి.. ఈ రెండింటిలో ప్రైవేట్ ఆధిపత్యం ఉంది. కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతున్నా మన ప్రభుత్వాలు కల్లు ఉండి చూడలేని దైన్యం కనిపిస్తుంటుంది.
అంతదాకా ఎందుకు దేశంలో కరోనా విజృంభిస్తోంది. వేల ప్రాణాలు పోతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీల్లో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కనిపిస్తోంది. తెలంగాణలో వైద్యం అందక చాలామంది మరణించారు. ఓ జర్నలిస్ట్ వైద్యం అందక కన్నుమూశాడు. మన ప్రభుత్వాలు వైద్యంపై బడ్జెట్ లో కేటాయించేది కనీసం 10శాతం కూడా ఉండడం లేదు..అందుకే వసతుల లేమితో ప్రాణాలు పోతున్నాయి.
కానీ ఏపీ సీఎం జగన్ విద్య, వైద్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరిచేత ప్రశంసలు అందుకున్నారు.. తన తండ్రి నెలకొల్పిన 108, 104 సేవలను పునరుద్దరించాడు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో 1088 వాహనాలను సీరియల్ గా నిలబెట్టి జాతరలా వాటిని ప్రారంభించిన వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. జగన్ ప్రజారోగ్యానికి ఇచ్చిన విలువ ఏంతనో దీని ద్వారా అందరికీ తెలిసివచ్చింది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందించారు. జగన్ అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. దేశంలోని మిగిలిన వారు ఏపీని ఫాలో కావాలంటూ ఆయన ట్వీట్ చేసి ప్రశంసలు కురిపించారు.
ఇలా జగన్ ప్రజాసంక్షేమమే కాదు.. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించారు. 108 వాహనాలను ప్రతీ మండలం, జిల్లాకు పంపి అందిరికీ వైద్య పరీక్షలు చేయించేందుకు.. కరోనాను అరికట్టేందుకు పూనుకున్నారు. జగన్ చర్య దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ క్రమంలోనే జగన్ ను ఫాలో కావాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు మంత్రి కేటీఆర్ మాటలను బట్టి తెలుస్తోంది. ప్రజలు తమ పిల్లల చదువులు.. ఆరోగ్యం కోసమే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ రెండు రంగాలపై ఫోకస్ చేస్తామని చెప్పడం రాజకీయంగానూ టీఆర్ఎస్ కు తిరుగులేని లబ్ధి చేకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ తర్వాత నంబర్ 2 అయిన ఆయన తనయుడు.. మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తే..ఇక కేసీఆర్ కూడా ఏపీ సీఎం జగన్ ను ఫాలో కావడం ఖాయమని అర్థమవుతోంది. సీఎం కేసీఆర్ టార్గెట్ మారిందని.. ఇక నుంచి రెండు అంశాలే లక్ష్యంగా ఆయన ముందుకు వెళతారని కేటీఆర్ చెప్పుకొచ్చాడు. విద్య, వైద్యరంగాలకు ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని.. విద్యుత్, తాగునీరు, సాగునీరు రంగాలకు ప్రాధాన్యం ఇచ్చామని.. ఇప్పుడు ఈ రెండు రంగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన ఉందన్నారు. ఇక మీదట విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తామని కేటీఆర్ తెలిపారు.
అన్ని దేశాలు ప్రజారోగ్యం విషయంలో కోట్లు ఖర్చు చేస్తుంటాయి. అదేందో భారతదేశానికి వచ్చేసరికి ఈ దరిద్రం ఎక్కువైపోయింది. సంక్షేమానికి, ఉచితాలకు వరద పారిస్తూ ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తుంటాయి మన ప్రభుత్వాలు.. మన దేశంలో విద్య, వైద్యమే అత్యంత ఖరీదైనవి.. ఈ రెండింటిలో ప్రైవేట్ ఆధిపత్యం ఉంది. కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతున్నా మన ప్రభుత్వాలు కల్లు ఉండి చూడలేని దైన్యం కనిపిస్తుంటుంది.
అంతదాకా ఎందుకు దేశంలో కరోనా విజృంభిస్తోంది. వేల ప్రాణాలు పోతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీల్లో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కనిపిస్తోంది. తెలంగాణలో వైద్యం అందక చాలామంది మరణించారు. ఓ జర్నలిస్ట్ వైద్యం అందక కన్నుమూశాడు. మన ప్రభుత్వాలు వైద్యంపై బడ్జెట్ లో కేటాయించేది కనీసం 10శాతం కూడా ఉండడం లేదు..అందుకే వసతుల లేమితో ప్రాణాలు పోతున్నాయి.
కానీ ఏపీ సీఎం జగన్ విద్య, వైద్యానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరిచేత ప్రశంసలు అందుకున్నారు.. తన తండ్రి నెలకొల్పిన 108, 104 సేవలను పునరుద్దరించాడు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో 1088 వాహనాలను సీరియల్ గా నిలబెట్టి జాతరలా వాటిని ప్రారంభించిన వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. జగన్ ప్రజారోగ్యానికి ఇచ్చిన విలువ ఏంతనో దీని ద్వారా అందరికీ తెలిసివచ్చింది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అభినందించారు. జగన్ అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. దేశంలోని మిగిలిన వారు ఏపీని ఫాలో కావాలంటూ ఆయన ట్వీట్ చేసి ప్రశంసలు కురిపించారు.
ఇలా జగన్ ప్రజాసంక్షేమమే కాదు.. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించారు. 108 వాహనాలను ప్రతీ మండలం, జిల్లాకు పంపి అందిరికీ వైద్య పరీక్షలు చేయించేందుకు.. కరోనాను అరికట్టేందుకు పూనుకున్నారు. జగన్ చర్య దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ క్రమంలోనే జగన్ ను ఫాలో కావాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు మంత్రి కేటీఆర్ మాటలను బట్టి తెలుస్తోంది. ప్రజలు తమ పిల్లల చదువులు.. ఆరోగ్యం కోసమే ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ రెండు రంగాలపై ఫోకస్ చేస్తామని చెప్పడం రాజకీయంగానూ టీఆర్ఎస్ కు తిరుగులేని లబ్ధి చేకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.