ఎమ్మెల్యే కాంప్లెక్స్ లోకి దొంగతనానికి వచ్చి బలైపోయాడా?

Update: 2021-02-21 06:10 GMT
ఎమ్మెల్యే కాంప్లెక్స్ లో వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. టీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ లో వ్యక్తి అనామానాస్పద మృతి సంచలనంగా మారింది. ఆ కాంప్లెక్స్ లో వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన షేక్ షాదుల్లా (29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

స్థానికుల కథనం ప్రకారం.. మృతుడు షాదుల్ తోపాటు స్నేహితుడు నద్ఢు కాంప్లెక్స్ లోకి దొంగతానికి వచ్చినట్లుగా తెలిసింది. ఈ ఘటనలో వారిపై అక్కడే ఉన్న వారు దాడి చేయగా.. షాదుల్లా మృతి చెందాడని అంటున్నారు. అక్కడి స్థానికులు తమకు సమాచారం ఇవ్వడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చామని కుటుంబ సభ్యులు తెలిపారు.

అక్కడి వాస్తవాలు తమకు ఏమీ చెప్పడం లేదని.. సంఘటనా స్థలానికి సెక్యూరిటీ సిబ్బంది రానివ్వడం లేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. వాస్తవాలు ఏంటో తెలియని తమకు న్యాయం చేయాలని మృతుడి బంధువులు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News