3 కోట్లతో మంత్రికి ఇల్లు కట్టించిన ఆ అధికారి ఎవరు?

Update: 2021-07-20 05:07 GMT
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఒక ఏపీ మంత్రికి రూ.3 కోట్లతో ఓ ఏపీ అధికారి ఇల్లు కట్టించాడని సోము వీర్రాజు ఆరోపించారు. ఈ ఆరోపణలు ఏపీ వ్యాప్తంగా సంచలనమయ్యాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష  టీడీపీలోనూ ఎవరా మంత్రి? ఎవరా అధికారి? 3 కోట్లు ఎలా పెట్టారని ఆరాతీయడం మొదలుపెట్టారు.

అయితే ఆరోపణలు అయితే చేశారు కానీ సోము వీర్రాజు అందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం ఇప్పటికీ బయటపెట్టలేదు. దీంతో ఇప్పుడు ఆయన అందరికీ టార్గెట్ చేశారు. ప్రజల్లో ఫేమ్ కోసం.. మీడియా ఫోకస్ కోసం ఇలాంటి ఆరోపణలు చేశారా? అని వైసీపీ, టీడీపీలు ఆరోపిస్తున్నాయి. నిజంగా దమ్ముంటే ఆధారాలు చూపించాలని సవాల్ చేస్తున్నాయి.

ఇప్పటికీ కూడా ఆ 3 కోట్ల కథ విప్పకుండా సోము వీర్రాజు అందరికీ టార్గెట్ అవుతున్నారు. సంచలనం కోసం సోము వీర్రాజు ఇలా అన్నారా? అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  దీనివెనుక నిజంగా అవినీతి జరిగిందనే వాదన వినిపిస్తే బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ప్రతిపక్షాలు ఇంత కోరుతున్నా కూడా సోము వీర్రాజు ఆ మంత్రి, అధికారి వివరాలను మాత్రం వెల్లడించడం లేదు. దీంతో ఇప్పుడు సోము వీర్రాజు ఏపీ రాజకీయాల్లో అభాసుపాలవుతున్నారు. అధికార, ప్రతిపక్ష నేతలు కూడా సోమును టార్గెట్ చేయడం గమనార్హం.

ఏపీ మంత్రిని టార్గెట్ చేసిన సోము వీర్రాజుకు ఇప్పుడు అధికార పక్షంగా గట్టిగా నిలదీస్తోంది. ఒకవేళ చెప్పకుంటా నష్టపరిహారం దావా వేస్తామని.. సోము వీర్రాజును అడ్డుకుంటామని హెచ్చరిస్తోంది. కీలక పదవిలో ఉండి ఇలా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంత తీవ్రమైన విమర్శలు చేస్తావా? అని మండిపడుతోంది.

ఇక టీడీపీ మాత్రం వెంటనే ఆ 3 కోట్ల ఆరోపణలు బయటపెట్టాలని.. తద్వారా ఏపీ మంత్రిని టార్గెట్ చేయవచ్చని సోము వీర్రాజును డిమాండ్ చేస్తోంది. కానీ ఎంత ఆరోపించినా కూడా సోము వీర్రాజు మాత్రం ఇప్పటికీ ఆ మంత్రి పేరు బయటపెట్టడం లేదు.


Tags:    

Similar News