జగన్ కోసం అర్రులు చాస్తున్న కాంగ్రెస్

Update: 2017-06-05 07:00 GMT
గుంటూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రత్యేక హోదా భరోసా సభలో జాతీయ స్థాయి నేతలందరి నోటా జగన్ మాటే వినిపించింది. హోదాపై కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి... ఏం చేయాలనుకుంటోందన్నది పక్కన పెడితే ఈ విషయంలో జగన్ ఏం చేయాలో వారంతా సూచించడం మొదలుపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వారందరినీ తెచ్చి లాబీయింగ్ చేయించి జగన్ సాయం కోరుతున్నట్లుగా కనిపించింది. ప్రత్యేక హోదా విషయంలో కానీ, ఇతర అంశాల్లో కానీ జగన్ అండ కోసం కాంగ్రెస్ పార్టీ అర్రులు చాస్తోందన్న విషయంలో ఈ సభ సాక్షిగా వెల్లడైంది.
    
ప్రత్యేకహోదా సభకు వచ్చిన జేడీయూ నేత శరద్ యాదవ్ - సమాజ్ వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ లు జగన్ ప్రస్తావన తీసుకొచ్చారు. శరద్ యాదవ్ అయితే... జగన్ తమతో కలవాలని డైరెక్టుగా బహిరంగ సభలోనే కోరారు. రాష్ర్టపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి అస్సలు మద్దతివ్వొద్దంటూ యాదవ్ జగన్ ను ఉద్దేశించి సూచించారు.
    
మరోవైపు యూపీ మాజీ సీఎం - సమాజ్ వాది పార్టీ నేత అఖిలేశ్ కూడా జగన్ ను ఉద్దేశించి ఇలాంటి సూచనలే చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ర్టపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తామని షరతు పెట్టాలంటూ జగన్ ను ఉద్దేశించి కోరారు. జగన్ ఆ సభకు రాకపోయినా వచ్చిన నేతలంతా జగన్ కు సాహో అనడం కనిపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News