జగన్ పుట్టిన రోజున ఏపీలో ‘సచివాలయ దినోత్సవం’

Update: 2020-12-14 03:27 GMT
ఏపీ సీఎం జగన్ మానస పుత్రిక ‘సచివాలయ వ్యవస్థ’. దేశంలోనే ఇదో గొప్ప సంస్కరణ.. పాలనను రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయికి డైరెక్టుగా అందించే వ్యవస్థ. గ్రామ పరిపాలనకు కేంద్ర బిందువులుగా సచివాలయ వ్యవస్థలు ఉన్నాయి. అందుకే ఈ పథకంపై దేశవ్యాప్తంగా మేధావులు , రాజకీయ నాయకులు జగన్ పై ప్రశంసలు కురిపించారు. వేయినోళ్ల పొగిడారు. కాబోయే ఐఏఎస్, ఐపీఎస్ లకు సీఎం జగన్ ప్రవేశ పెట్టిన ‘సచివాలయ వ్యవస్థ’పై శిక్షణ కూడా ఇచ్చారంటే ఈ పథకం గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.

అందుకే ఈ గొప్ప పథకాన్ని ఏపీలో పండుగలా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు అయిన డిసెంబర్ 21న రాష్ట్ర వ్యాప్తంగా ‘సచివాలయ దినోత్సవం’గా జరుపనున్నారు.

ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం తీర్మానించింది. అధికారంలోకి వచ్చిన కేవలం 3 నెలల్లోనే 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం అసాధారణ విషయం అని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.

2019, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా వలంటీర్లు ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందిస్తారు. తద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందిస్తారు.
Tags:    

Similar News