పవన్.. ఓ మిస్టర్ కన్ ఫ్యూజన్

Update: 2019-03-23 14:30 GMT
తెలంగాణపై జనసేనాని  పవన్ కళ్యాణ్ చేసిన విద్వేష పూరిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.. అటు కేటీఆర్ నుంచి మొదలు పెడితే ఇటు ఆంధ్రా నేతలు కూడా పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. తాజాగా ‘తెలంగాణలో ఆంధ్రా వాళ్లను కొడుతున్నారు’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై  వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సి. రామచంద్రయ్య మాట్లాడుతూ.. పవన్ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి మరోసారి చంద్రబాబును సీఎం చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించాడు. పవన్ ప్యాకేజీ తీసుకునే ఇదంతా చేస్తున్నాడని ఆరోపించారు. పవన్..  ఓ మిస్టర్ కన్ఫ్యూజన్ అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు జనాలందరూ పవన్ ను ప్యాకేజీ పవన్ అంటున్నారని ఎద్దేవా చేశారు.  టీడీపీ ప్రభుత్వంలో జరిగిన విశాఖ భూకుంభకోణాలపై మాట్లాడని పవన్.. జగన్ వస్తే భూములు ఖాళీ అని విమర్శలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చేగువేరా అంటూ పవన్ ఏదోదో చెప్తుంటే ఏదో చేస్తాడనుకున్నామని... కానీ నీచమైన రాజకీయాలు చేస్తున్నాడని రామచంద్రయ్య మండిపడ్డారు. బాబుకు గొడుగు పట్టి ఆయన్ను మరోసారి సీఎం చేయడమే పవన్ టార్గెటా అని ప్రశ్నించారు. జేడీ లక్ష్మీనారాయణ అర్ధరాత్రి చంద్రబాబునుకలిసి.. అనంతరం జనసేన నుంచి పోటీకి దిగుతున్నట్టు ప్రకటించడం కుట్ర అని అన్నారు. దీనిపై పవన్ ప్రవచనాలు చెబుతున్నాడని విమర్శించారు. ఇప్పుడు బాబును, లోకేష్ ను పవన్ ఎందుకు తిట్టడం లేదో చెప్పాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కుట్ర చేయడానికి టీడీపీ ఎంతవరకైనా దిగజారుతుందని రామచంద్రయ్య ఆరోపించారు. ఈసీ ప్రత్యేక పరీశీలకులను ఏపీలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Tags:    

Similar News