కొత్త 50, 20 నోట్లు వచ్చేస్తున్నాయ్

Update: 2016-12-04 12:03 GMT
దేశంలో నగదు కష్టాలకు పుల్ స్టాప్ పెట్టడానికి గాను ఆర్బీఐ చర్యలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు రూ.50  - రూ. 20 విలువ గల నోట్లు కొత్తవి ముద్రిస్తోంది.  త్వరలోనే వీటిని అందుబాటులోని తేనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త నోట్ల డిజైన్ పూర్తయి ముద్రణ మొదలైనట్లు సమాచారం. కాగా... కొత్త నోట్ల రాకతో పాత నోట్లు రద్దవుతాయని జనం ఆందోళన చెందుతున్నారు.. కానీ, కొత్త నోట్లతో పాటు పాతవి కూడా మనుగడలోనే ఉంచాలని ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి.
    
కాగా ఈ రెండు డినామినేషన్ల నోట్ల తరువాత రూ.10 నోట్లూ కొత్తవి రానున్నాయి. అయితే ఈ చిన్న డినామినేషన్ల నోట్ల రూపులో పెద్దగా మార్పుల్లేనట్లు తెలుస్తోంది. ఆర్బీఐ గవర్నరు ఉర్జీత్ పటేల్ సంతకం ఒకటి మారుతుంది. గాంధీ బొమ్మ, సెక్యూరిటీ ఫీచర్లు వంటివి యథాతథంగా ఉంటాయి.
    
అయితే... సోషల్ మీడియాలో మాత్రం రూ.50 - రూ.20 నోట్లపై వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ ల చిత్రాలు ఉంటాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి కొన్ని ఊహా నోట్ల చిత్రాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే... గాంధీ బొమ్మను రీప్లేస్ చేయబోరని తెలుస్తోంది.
Tags:    

Similar News