రేపిస్ట్ రాజును పోలీసులే చంపారు: కుటుం బ సభ్యుల ఆరోపణ

Update: 2021-09-16 06:53 GMT
సైదాబాద్ లో బాలికను రేప్ చేసి చంపిన నిందితుడు రాజు కోసం తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పడుతున్న వేళ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. కీచకుడు రాజు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

ఆరేళ్ల చిన్నారి చైత్రపై అత్యాచారానికి పాల్పడి అత్యంత దారుణంగా హత్య చేసి తప్పించుకొని తిరుగుతున్న రాజు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతడి డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. దీంతో రాజు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

సైదాబాద్ సింగరేణి కాలనీ రేప్ కేసు ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఘట్కేసర్-వరంగల్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులు గమనించారు.

నగర నడిబొడ్డులోని సైదాబాద్-సింగరేణి కాలనీలో హత్యాచారం చేశాక రాజు తప్పించుకున్నాడు. అతడు చివరి సారి ఉప్పల్ లో కనిపించాడు. తర్వాత అతడి ఆచూకీ కోసం పోలీసులు చేయని ప్రయత్నాల్లేవు. 10 లక్షల రివార్డ్ ప్రకటించారు. చివరకు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు.

ఇక రాజు ఆత్మహత్యపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. రాజును పోలీసులే హత్య చేసి ఉంటారని అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ముందే చంపేసి ఆ తర్వాత రైలుపట్టాలపై పడేసి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు.

నిందితుడు రాజు చేసింది తప్పేనని.. అయితే ఆత్మహత్య చేసుకొని ఉండడని అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాజు రేప్ చేశాడంటే తాము నమ్మేవాళ్లం కాదని.. చిన్నారి మృతదేహం రాజు ఇంట్లో దొరికినందునే నమ్ముతున్నామని చెప్పారు.



Tags:    

Similar News