చంద్రబాబు బ్లాక్ మనీ మార్చాకే ప్రధాని ప్రకటన

Update: 2016-11-13 11:04 GMT
ఏపీ సీఎం చంద్రబాబుపై పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శల వర్షం కురిపించారు. పెద్ద నోట్లను రద్దు చేయనున్నారన్న విషయం బీజేపీ, టీడీపీ నేతలకు ముందుగానే తెలుసునని, వారంతా తమ వద్ద ఉన్న బ్లాక్ మనీని సర్దుకున్నాకే మోదీ నోటివెంట ప్రకటన వెలువడిందని ఆయన ఆరోపించారు. అనంతపురంలోని ఎస్బీఐ కార్యాలయం వద్ద డబ్బు కోసం నానా అవస్థలు పడుతున్న ప్రజలకు సంఘీభావంగా ఆయన బైఠాయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దుతో చంద్రబాబు - లోకేష్ లకు ప్రయోజనాలు కలిగాయని ఆయన ఆరోపించారు. ప్రధాని ప్రకటనకు గంటల ముందు ఓ బీజేపీ నేత కోటి రూపాయలు డిపాజిట్ చేశాడని గుర్తు చేశారు.  ప్రజలు మాత్రం ఇప్పుడు అవసరాలకు కూడా చేతిలో డబ్బు లేక నానా తిప్పలు పడుతున్నారని... పనులు మానుకుని, సెలవులు పెట్టి మరీ ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ఎండలో పడిగాపులు కాస్తున్నారని అన్నారు.

తాను లేఖ రాస్తేనే రూ. 500 - రూ. 1000 నోట్లను ప్రధాని రద్దు చేశారని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ధైర్యం, దమ్ము ఉంటే రూ. 2 వేల నోటును రద్దు చేయించాలని సవాల్ విసిరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News