సండే రోజున సింధు సంచలన విజయం

Update: 2015-11-29 07:52 GMT
కొన్ని ఆటలు.. కొంతమంది ఆటగాళ్లకు రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రావు. వారెంత కష్టపడినా.. వారెన్ని అద్భుతమైన విజయాలు సాధించినా.. వారు సాధించిన వాటి కంటే తక్కువ పేరు ప్రఖ్యాతులతో పాటు.. ఫేమ్ కూడా తక్కువగా వస్తుంది. అలాంటి వారిలో బ్యాడ్మింటన్ స్టార్.. తెలుగమ్మాయి సింధు ఒకరిగా చెప్పొచ్చు.

తాజాగా ఆమె మకావు ఓపెన్ గ్రండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్ లో విజేతగా నిలిచింది. మహిళా సింగిల్స్ లో జపాన్ కు చెందిన మినత్సు మితానిపై ఆమె ఘన విజయం సాధించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అంతర్జాతీయ టోర్నమెంట్ లో వరుసగా మూడో విజయాన్ని సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో కేవలం 30 నిమిషాల్లో ముగించింది. రెండో సెట్ లో ప్రత్యర్థి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. తన పోరాట పటిమతో మూడో సెట్ లో అద్భుతమైన ఆటను ప్రదర్శించి విజయం దిశగా దూసుకెళ్లింది. వరుసగా మూడు ఇంటర్నేషనల్ టైటిల్స్ సొంతం చేసుకోవటం గొప్ప విషయంగానే చెప్పాలి. ఏదైనా అంతర్జాతీయ టోర్నమెంటు గెలిచిన వెంటనే రూ.కోటి ప్రకటించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అంత మొత్తం కాకున్నా.. కాస్తంత ప్రోత్సాహకం ప్రకటిస్తే బాగుంటుందేమో..?
Tags:    

Similar News