ఫొటో వాట్సప్‌ స్టేటస్‌లో పెట్టాడని .. ఆ అమ్మాయి ఏంచేసిందంటే ?

Update: 2021-05-15 09:30 GMT
ప్రస్తుత రోజుల్లో ప్రతి దానికి చావే శరణ్యం అని చాలామంది పిల్లలు చిన్న చిన్న కారణాలకి కూడా ఆత్మహత్య కి పాల్పడుతున్నారు. కనీసం దాని గురించి ఆలోచించకుండానే ఏవేవో కారణాలతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. క్షణికావేశం తో ఆత్మహత్య కి పాల్పడుతూ తల్లిదండ్రులకి తీరని కడుపు కోత మిగుల్చుతున్నారు. తాజాగా ఓ మైనర్ బాలిక కూడా క్షణికావేశం లో ఆత్మహత్య కి పాల్పడింది. తన ఫ్రెండ్ వాట్సాప్ స్టేటస్ లో తన ఫోటో పెట్టాడని తీవ్రమనస్తాపానికి గురై ఆత్మహత్య కి పాల్పడింది. ఈ ఘటన నల్గొండ జిల్లా బొమ్మలరామారం మండలంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే .. బోయిన్‌పల్లి గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలిక మూడు చింతల పల్లి మండలం పోతారం గ్రామంలో ఉన్న కూరగాయల తోటలో కూలీగా జీవనం సాగిస్తోంది.  ఈ సమయంలో నే  బోటిమీది తండాకు చెందిన ఓ అబ్బాయి తో  పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య గల సన్నిహితంతో బాలుడు సదరు బాలిక ఫొటోను శుక్రవారం తన వాట్సప్‌ స్టేటస్‌ లో పెట్టుకున్నాడు. దీంతో బాలుడి వాట్సాప్‌ స్టేటస్‌ లో తన ఫొటో పెట్టాడని చూసి , తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తాను పనిచేసే తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ అబ్బాయి వేధింపులతోనే తన కూతురు  ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లి షామీర్‌ పేట్‌ లోని పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.
Tags:    

Similar News