మోడీ గ్రాఫ్ తో కాంగ్రెస్లో కొత్త ఆశలు..
ఏడేళ్లపాటు దేశాన్నిఏలుతున్న మోడీ మేనియా తగ్గిపోతుందా..? 2014 కు ముందు ప్రజలకు మోడీపై ఉన్న నమ్మకం ఇప్పుడు లేదా..? ఇటీవల మోడీ గ్రాప్ తగ్గిపోయినట్లు ఇండియా టుడే చేసిన సర్వేలో తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఇదే చర్చ సాగుతోంది. ఈ సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2024లో పాగా వేసేందుకు సన్నద్ధమవుతోంది. అందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యులతో ఆన్లైన్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇదే మంచి అవకాశమని, ఇక పార్టీ శ్రేణులు రెడీగా ఉండాలని సూచనలు చేసింది. దీంతో తెరపైకి మళ్లీ థర్డ్ ఫ్రంట్ వస్తుందా..? అనే చర్చ సాగుతోంది.
2014 నుంచి ఏడేళ్లుగా మోడీ తిరుగులేని నాయకుడిగా కొనసాగారు. మొదటి ఐదేళ్లు చేసిన పాలనపై నమ్మకం ఉన్న ప్రజలు మరోసారి ఆయనకే అధికారం కట్టబెట్టారు. దీంతో రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన వెంటనే ఆయన స్ట్రాటజీ తగ్గిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. గతేడాది మోడీ గ్రాఫ్ ఏమాత్రం తగ్గకపోయి కేవలం ఏడాదిలోనే ఆయన గ్రాఫ్ పడిపోవడం గమనార్హం. దీంతో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడానికి సిద్ధమవుతోంది. ప్రత్యేకంగా కొన్ని లక్ష్యాలను ముందుంచి వాటిని పూర్తి చేయడానికి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.
వచ్చే ఎనికల్లో ఎన్డయే కూటమిని ఎలాగైనా ఓడించే లక్ష్యాన్ని పెట్టుకుంది కాంగ్రెస్. ఇందుకు ఒంటరిగా కాకుండా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు రెడీ అవుతోంది. ఒంటరిగా కాకుండ కలిసికట్టుగా పోరాడితే విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఐక్యతారాగం వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ప్రతిపక్ష నాయకులందరినీ కలుపుకకుపోతున్నారు. ఇటీవల ఆ పా్టీ కీలక నాయకులు రాహుల్ గాంధీ ప్రతిపక్షాలన్నింటికి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కొందరితో ఎప్పుడూ టచ్లో ఉంటున్నారు. ఒక్కోసారి మెట్టు దిగి కొందరు చెబుతున్న సూచనలు పాటిస్తున్నారు.
ఇటీవల వర్చువల్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానం ఓ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇందులో ప్రతిపక్షాలన్నీ శరత్ పవార్ తో సహా ప్రతిపక్ష నాయకులందరూ హాజరయ్యారు. కానీ ఆప్, అకాలీదళ్ కు మాత్రం ఆహ్వానం అందలేదు. ఇప్పటికే కమలం పార్టీపై వస్తున్న వ్యతిరేకతను అస్త్రాలుగా చేసుకొని వాటితో ప్రజల్లోకి వెళ్లనున్నారు. రైతు చట్టాలు, కోవిడ్ వైఫల్యం, పెగాసస్ వివాదం వంటి అంశాలను ప్రధానంగా చేసుకొని బీజేపీపై పోరాటం చేయనున్నారు. ప్రస్తుతం లోక్ సభలో 543 సీట్లలో కాంగ్రెస్ కనీసం 136 సీట్లను గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంది. మిగిలిన సీట్లు బీజేపీ గెలుచుకున్నా టార్గెట్ రీచ్ కావాలని చూస్తోంది.
2019 ఎన్నికల ముందు కూడా మమతా బెనర్జీ నేతృత్వంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు సాగాయి. జనవరిలో కోల్ కతాలో టీఎంసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి 22 పార్టీల నేతలు హాజరయ్యారు. కానీ రెండోసారి కూడా ఎన్టీయేనే అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి థర్డ్ ఫ్రంట్ సమావేశాలు జరగలేదు. కానీ తాజాగా మరోసారి థర్డ్ ఫ్రంట్ తెరపైకి వస్తోంది. అదీ కాగా రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లోకి చేరడంతో ఆ కూటమికి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తోంది. అయితే పీకే లెక్కలు, వ్యూహాలు థర్డ్ ఫ్రంట్ ను విజయతీరానికి చేకూరుస్తాయా..? అన్న చర్చ సాగుతోంది. అయితే ప్రధాని గ్రాఫ్ తగ్గిందన వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్లో మరోసారి జోష్ నింపింది. 2020లో 66 శాతంగా ఉన్న మోదీ గ్రాఫ్ ఈ ఏడాదికి 38 శాతానికి పడిపోయింది. ఆగస్టు నాటికి అది కేవలం 26 శాతానికి పడిపోయింది.
2014 నుంచి ఏడేళ్లుగా మోడీ తిరుగులేని నాయకుడిగా కొనసాగారు. మొదటి ఐదేళ్లు చేసిన పాలనపై నమ్మకం ఉన్న ప్రజలు మరోసారి ఆయనకే అధికారం కట్టబెట్టారు. దీంతో రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన వెంటనే ఆయన స్ట్రాటజీ తగ్గిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. గతేడాది మోడీ గ్రాఫ్ ఏమాత్రం తగ్గకపోయి కేవలం ఏడాదిలోనే ఆయన గ్రాఫ్ పడిపోవడం గమనార్హం. దీంతో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడానికి సిద్ధమవుతోంది. ప్రత్యేకంగా కొన్ని లక్ష్యాలను ముందుంచి వాటిని పూర్తి చేయడానికి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.
వచ్చే ఎనికల్లో ఎన్డయే కూటమిని ఎలాగైనా ఓడించే లక్ష్యాన్ని పెట్టుకుంది కాంగ్రెస్. ఇందుకు ఒంటరిగా కాకుండా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు రెడీ అవుతోంది. ఒంటరిగా కాకుండ కలిసికట్టుగా పోరాడితే విజయం సాధిస్తామన్న నమ్మకంతో ఐక్యతారాగం వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ప్రతిపక్ష నాయకులందరినీ కలుపుకకుపోతున్నారు. ఇటీవల ఆ పా్టీ కీలక నాయకులు రాహుల్ గాంధీ ప్రతిపక్షాలన్నింటికి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కొందరితో ఎప్పుడూ టచ్లో ఉంటున్నారు. ఒక్కోసారి మెట్టు దిగి కొందరు చెబుతున్న సూచనలు పాటిస్తున్నారు.
ఇటీవల వర్చువల్ ద్వారా కాంగ్రెస్ అధిష్టానం ఓ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఇందులో ప్రతిపక్షాలన్నీ శరత్ పవార్ తో సహా ప్రతిపక్ష నాయకులందరూ హాజరయ్యారు. కానీ ఆప్, అకాలీదళ్ కు మాత్రం ఆహ్వానం అందలేదు. ఇప్పటికే కమలం పార్టీపై వస్తున్న వ్యతిరేకతను అస్త్రాలుగా చేసుకొని వాటితో ప్రజల్లోకి వెళ్లనున్నారు. రైతు చట్టాలు, కోవిడ్ వైఫల్యం, పెగాసస్ వివాదం వంటి అంశాలను ప్రధానంగా చేసుకొని బీజేపీపై పోరాటం చేయనున్నారు. ప్రస్తుతం లోక్ సభలో 543 సీట్లలో కాంగ్రెస్ కనీసం 136 సీట్లను గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంది. మిగిలిన సీట్లు బీజేపీ గెలుచుకున్నా టార్గెట్ రీచ్ కావాలని చూస్తోంది.
2019 ఎన్నికల ముందు కూడా మమతా బెనర్జీ నేతృత్వంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు సాగాయి. జనవరిలో కోల్ కతాలో టీఎంసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి 22 పార్టీల నేతలు హాజరయ్యారు. కానీ రెండోసారి కూడా ఎన్టీయేనే అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి థర్డ్ ఫ్రంట్ సమావేశాలు జరగలేదు. కానీ తాజాగా మరోసారి థర్డ్ ఫ్రంట్ తెరపైకి వస్తోంది. అదీ కాగా రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లోకి చేరడంతో ఆ కూటమికి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తోంది. అయితే పీకే లెక్కలు, వ్యూహాలు థర్డ్ ఫ్రంట్ ను విజయతీరానికి చేకూరుస్తాయా..? అన్న చర్చ సాగుతోంది. అయితే ప్రధాని గ్రాఫ్ తగ్గిందన వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్లో మరోసారి జోష్ నింపింది. 2020లో 66 శాతంగా ఉన్న మోదీ గ్రాఫ్ ఈ ఏడాదికి 38 శాతానికి పడిపోయింది. ఆగస్టు నాటికి అది కేవలం 26 శాతానికి పడిపోయింది.