కరోనా భయంతో ఆత్మహత్యకి పాల్పడ్డ వివాహిత !

Update: 2020-08-18 17:30 GMT
కరోనా మహమ్మారి భారిన పడి కొంతమంది మరణిస్తుంటే ..మరికొంతమంది అమాయకులు తమకు ఎక్కడ సోకుతుందోనన్న భయంతో ఆత్మహత్య కు పాల్పడుతున్నారు. ఈ మధ్య ఈ తరహా ఘటనలే ఎక్కువైయ్యాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఇలాంటి దారుణ సంఘటన జరిగింది. కరోనా భయంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండంలోని బొంకూర్‌ గ్రామంలో సోమవారం జరిగింది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ,.. బొంకూర్‌ గ్రామానికి చెందిన మాదాసు మల్లేశం, సత్తవ్వ దంపతులకు ముగ్గురు కూతుర్లు. చిన్న కూతురు నారా మేఘన బీఫార్మసీ చదువుకుంది. ఈమెకి ధర్మారం మండలకేంద్రానికి చెందిన నారా మధుసూదన్‌ కు ఇచ్చి రెండునెలలక్రితం వివాహం చేశారు. ఆ తరువాత కూడా అంతా సజావుగానే సాగుతుంది.  ఇక ,పెళ్లి అయిన కొద్దిరోజులకు హైదరాబాద్‌ వెళ్లారు. మేఘన ఫార్మసీలో ఉద్యోగం చేస్తుండగా ఆమె భర్త ప్రైవేట్‌ కంపెనీలో సూపర్ ‌వైజర్‌ గా పనిచేస్తున్నాడు. వారంక్రితం జ్వరంకాగా జగిత్యాలలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చూపించాడు. కరోనా లక్షణాలు లేవనిచెప్పినప్పటికీ తల్లిగారింటికి  వెళ్లానని చెప్పడంతో భర్త బొంకూర్‌లో దింపి వెళ్లాడు.

ఇక , టైపాయిడ్‌ జ్వరంతో బాధపడుతున్న మేఘన కరోనా అనుమానంతో ఆదివారం రాత్రి ఇంట్లో అందరూపడుకుని నిద్రిస్తుండగా తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు తెల్లవారు లేచి చూసే సరికి శవమై కనిపించింది. రోనా వచ్చిందేమోననే భయంతో తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మేఘన తండ్రి మాదాసు పెద్దమల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎమ్మార్వో నవీన్‌ పంచనామా నిర్వహించడంతో ఎస్సై జీవన్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పెళ్లి జరిగిన కేవలం  రెండునెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ రెండుకుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Tags:    

Similar News