లోకేష్ ఆ ‘గేమ్స్’ ఆడుతున్నాడా?

Update: 2020-07-06 10:30 GMT
కరోనా ఎంత పనిచేసింది. బయటకొచ్చిన వాళ్లను కబళిస్తోంది. ఉద్యోగ, ఉపాధిని దూరం చేసింది. మరి డబ్బున్న వాళ్లను ఏం చేసిందయ్యా అంటే కొత్త కొత్త వ్యాపకాలను పెట్టుకునేలా చేసింది. అవును కరోనాతో ఇప్పుడు చాలా మంది సీనీ, రాజకీయ ప్రముఖులు వేరే వేరే పనులు చేస్తూ సేదతీరుతున్నారు.

మన చినబాబు.. టీడీపీ భావి నాయకుడు నారా లోకేష్ బాబు కూడా ఈ ఖాళీ టైంలో గేమ్స్ ఆడుతున్నాడట.. వాటికి బానిసగా మారిపోయాడని టీడీపీ వర్గాల్లో పెద్ద టాక్. అదేపనిగా ఆ పాడు గేముల్లో ఆడుకుంటూ పార్టీని, ఇంటిని మరిచిపోతున్నాడని.. చిన్న పిల్లాడిలా దానికి బానిస అయ్యాడని టీడీపీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి..

లోకేష్ కరోనా మొదలైన కొత్తలో పట్టుబట్టి మరీ డైటీషియన్ ను పెట్టుకొని మరీ సన్నబడ్డాడట. ప్రస్తుతం ఆ పని దిగ్విజయంగా పూర్తికావడంతో   ప్రస్తుత కరోనా టైంలో  టైంపాస్ కు ఎపిక్ గేమ్స్ కు బాగా అలవాటుపడ్డాడంట.. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ ఎపిక్ గేమ్స్ లో గ్రూప్స్ గా ఉండి టీంలాగా ఏర్పడి ఆడుతుంటారు. ఇప్పుడు వీటిని విపరీతంగా లోకేష్ ఆడుతున్నాడని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో హాట్ టాపిక్ చర్చ నడుస్తోంది.  ఈ గేమ్స్ లో పడి జూమ్ మీటింగ్ లో పార్టీ వాళ్లతో సరిగా మాట్లాడడం లేదు అని టీడీపీ వాళ్లు తెగబాధ పడుతున్నారు అంట.. 
Tags:    

Similar News