ఆ కారు నాది కాదు.. : కారు ప్రమాదంపై ఎమ్మెల్యే షకీల్ రియాక్షన్
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో జరిగిన కారు ప్రమాదంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఎట్టకేలకు స్పందించారు. ప్రమాదం విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రమాదానికి గురైన కారు తనదికాదని ఆయన స్పష్టం చేశారు. తన కజిన్ కారు తగిలి పసిపాప మృతి చెందిందని తెలిపారు. తన కజిన్ కారును తాను కూడా అప్పుడప్పుడు వాడతానని చెప్పారు.
అందుకే ఆ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ పెట్టామని పేర్కొన్నారు. పసిపాప ప్రాణం పోవడం చాలా బాధకల్గించిందన్నారు. ట్రీట్ మెంట్ ఇప్పించాలని తన కజిన్ కు చెప్పినట్లు తెలిపారు. కారు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని తన కజిన్ వివరించాడని చెప్పారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఒక మహిళా యాచకురాలు అకస్మాత్తుగా పరిగెత్తడం వల్లనే యాక్సిడెంట్ అయిందని తనకు తెలిసిందని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. దాంతో బాబుని కింద పడేయడం వల్లే బాబు మృతి చెందాడని తెలిపారు. ఇది ప్రమాదమా, నిర్లక్ష్యం వలన జరిగిందా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేయాలన్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తే నిజం తెలుస్తుందని చెప్పారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని తన కజిన్ కి చెప్పానని తెలిపారు. ఈ ఘటన జరగడం బాధాకరం అన్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న మహిళని కారు అదుపు తప్పి ఢీకొం ది. మహిళ చేతిలో నుంచి జారి పడి రెండున్నర నెలల బాబు మృతి చెందాడు. ప్రమాదం తరువాత కారు వదిలి డ్రైవర్ పరార య్యాడు. కారుకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఇద్దరి అరెస్టు!
జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీర్జా, అతని కుమారుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో దుర్గం చెరువు తీగల వంతెన వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-1 వైపు మహీంద్రా కారు వెళ్లింది. తిరిగి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లో వంతెన దిగి కొంతదూరం వచ్చిన తర్వాత రోడ్డు దాటుతున్న ముగ్గురు యాచక మహిళలను కారు ఢీకొట్టింది. ఓ మహిళ చేతిలో ఉన్న రెండున్నర నెలల బాబు కిందపడడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ముగ్గురు మహిళలకూ గాయాలయ్యాయి.
అందుకే ఆ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ పెట్టామని పేర్కొన్నారు. పసిపాప ప్రాణం పోవడం చాలా బాధకల్గించిందన్నారు. ట్రీట్ మెంట్ ఇప్పించాలని తన కజిన్ కు చెప్పినట్లు తెలిపారు. కారు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని తన కజిన్ వివరించాడని చెప్పారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఒక మహిళా యాచకురాలు అకస్మాత్తుగా పరిగెత్తడం వల్లనే యాక్సిడెంట్ అయిందని తనకు తెలిసిందని ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. దాంతో బాబుని కింద పడేయడం వల్లే బాబు మృతి చెందాడని తెలిపారు. ఇది ప్రమాదమా, నిర్లక్ష్యం వలన జరిగిందా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేయాలన్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తే నిజం తెలుస్తుందని చెప్పారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని తన కజిన్ కి చెప్పానని తెలిపారు. ఈ ఘటన జరగడం బాధాకరం అన్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న మహిళని కారు అదుపు తప్పి ఢీకొం ది. మహిళ చేతిలో నుంచి జారి పడి రెండున్నర నెలల బాబు మృతి చెందాడు. ప్రమాదం తరువాత కారు వదిలి డ్రైవర్ పరార య్యాడు. కారుకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఇద్దరి అరెస్టు!
జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీర్జా, అతని కుమారుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో దుర్గం చెరువు తీగల వంతెన వైపు నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-1 వైపు మహీంద్రా కారు వెళ్లింది. తిరిగి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-45లో వంతెన దిగి కొంతదూరం వచ్చిన తర్వాత రోడ్డు దాటుతున్న ముగ్గురు యాచక మహిళలను కారు ఢీకొట్టింది. ఓ మహిళ చేతిలో ఉన్న రెండున్నర నెలల బాబు కిందపడడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ముగ్గురు మహిళలకూ గాయాలయ్యాయి.